గత కొద్ది సంవత్సరాలుగా విమానయాన రంగంలో వస్తున్న మార్పులతో విమానంలో విహరించాలన్న ఆశలను నేరవేర్చుకోవడం మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా పలు నగరాలకు ప్రయాణికులను చేర్చేందుకు అత్యంత తక్కువ ధర ఆఫర్లను విమానయాన సంస్థలు ప్రకటించడంతో ఉన్నత మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలకే పరిమితమైన విమానయానం ఇకపై మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చింది.
తాజాగా విమాన సంస్థల చౌకధర పోటీ మార్కెట్ లోకి భారత్ లో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో కూడా చేరిపోయింది. పండగ వేళ బస్సు యాజమాన్యాలు ముక్కుపిండి ప్రయాణికుల నుంచి అధిక సోమ్మును రాబడుతున్న వేళ.. హైదరాబాద్ నుంచి విజయవాడకు 1000 రూపాయలకు పైగా చెల్లించాల్సి వస్తున్న సమయంలో, ఇండిగో విమానయాన సంస్థ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ కింద రూ. 806 (అన్ని పన్నులు కలుపుకుని)కే విమాన ప్రయాణాన్ని దగ్గర చేసింది. ఈ ఆపర్ లో భాగంగా రేపటిలోగా టికెట్లు బుక్ చేసుకుని ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 12 మధ్య ప్రయాణం పెట్టుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
కాగా, ఇటీవల చౌక ధరలకు ప్రయాణ సేవలందిస్తున్న గో ఎయిర్ రూ. 601 (బేస్ ఫేర్, ఫ్యూయల్ సర్ చార్జ్)కి, స్పైస్ జెట్ రూ. 716 (పన్నులు మినహా), ఎయిర్ ఆసియా రూ. 899 (అన్ని పన్నులు కలుపుకుని)లకు ప్రమోషనల్ స్కీములు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో దేశవాళీ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఈ తరహా స్కీములే కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. గత సంవత్సరం జనవరి నుంచి నవంబర్ వరకూ 61 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. 2014తో పోలిస్తే ఇది 20 శాతం అధికం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more