ఏపిలో దుమార రేపిన, ఎన్నో కుటుంబాల్లో తీవ్ర కలకలం రేపిన కల్తీ మద్యం కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. స్వర్ణ బార్ లో మద్యం సేవించిన వారు అకస్మాత్తుగా అనారోగ్యంపాలుకావడం.. అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం పెద్ద సంచలనం. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు చెందిన బార్ లో ఇదంతా జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనిని మల్లాది మాత్రం ఖండించారు. ఆ బార్ తనది కాదు అని అది తన బంధువులదని కూడా వెల్లడించారు. అయితే బార్ లో తాగిన మద్యంలో మాత్రమే కల్తీ ఉందని నివేదిక తేల్చడంతో.. అప్పటి నుండి మల్లాది విష్ణు కనిపించకుండా పోయారు. అయితే చాలా రోజుల తర్వాత తిరిగి కనిపించిన మల్లాది అసలు మ్యాటర్ ఏంటో వెల్లడించారు.
కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణు పేరును కూడా పోలీసులు తొమ్మిదో నిందితుడిగా చేర్చింది. అయితే అరెస్టు వారెంట్ వస్తుందన్న కారణంగా మల్లాది తప్పించుకు తిరుగుతున్నారని గతంలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత మల్లాది మీడియా ముందుకు వచ్చారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. తీర్థయాత్రలకు వెళ్లినందు వల్లే తాను ఎవరికీ అందుబాటులోకి రాలేదని వెల్లడించారు. అయితే కల్తీ మద్యం కేసులో తాను ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉన్నానని కూడా ఆయన వెల్లడించారు. రేపు తాను ఏం చెప్పాలనుకున్నానో వెల్లడిస్తానని అన్నారు. మరి రేపు మల్లాది విష్ణు ఏం చెబుతారు అన్నది ఇంట్రస్టింగ్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more