దేశంలో ఎంతో కీలకమైన పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆశా కిరణం రాహుల్ గాంధీ దేశం వదిలి రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లడం పెద్ద సంచలనానికి తెర తీసింది. రాహుల్ గాంధీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలల పాటు ఎవరికి కనిపించకుండా పర్యటనకు వెళ్లారు. అయితే రెండు నెలల తర్వాత తిరిగి దేశానికి వచ్చిన రాహుల్ మీద అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పించారు. అయితే ఆ రెండు నెలలు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళతారు అన్నదాని మీద అప్పుడు ఎవరికీ సమాచారం లేదు. అయితే తాజాగా రాహుల్ పర్యటన మీద క్లారిటీ వచ్చింది. రాహుల్ ఎక్కడెక్కడ.. ఎన్ని రోజులు ఉన్నాయన్న దాని మీద క్లారిటీ వచ్చింది.
రాహుల్ గాంధీ టూర్ వివరాలు ఇలా ఉన్నాయి.............
* ఫిబ్రవరి 16న న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన రాహుల్ గాంధీ అదే రోజు థాయ్ ల్యాండ్ రాజధాని బ్యాంకాక్ చేరుకున్నారు.
* ఒక రోజు బ్యాంకాక్ లోనే ఆయన బస చేశారు.
* ఫిబ్రవరి 17న బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ఆయన కంబోడియా చేరుకున్నారు. 11 రోజుల పాటు అక్కడే ఉన్నారు.
* కంబోడియా పర్యటనను ముగించుకున్న ఆయన ఫిబ్రవరి 28న తిరిగి బ్యాంకాక్ వచ్చారు.
* ఒక రోజు బ్యాంకాక్ లోనే ఉన్న రాహుల్, మార్చి 1న మయన్మార్ వెళ్లారు. దాదాపు 21 రోజుల పాటు మయన్మార్ లోనే ఉన్నారు.
* మార్చి 22న ధాయ్ ల్యాండ్ తిరిగివచ్చిన రాహుల్ ఆయుత్తయలోని బుద్ధిస్ట్ హెరిటేజ్ సెంటర్ ను సందర్శించారు. అక్కడే ఆయన 9 రోజుల పాటు గడిపారు
* మార్చి 31న వియత్నాం వెళ్లిన రాహుల్ ఏప్రిల్ 12న బ్యాంకాక్ తిరిగివచ్చారు.
* ఏప్రిల్ 12 నుంచి 16 వరకు రాహుల్ గాంధీ బ్యాంకాక్ లోనే సేదదీరారు.* ఏప్రిల్ 16న తన సుదీర్ఘ సెలవును ముగించుకుని రాహుల్ గాంధీ తిరిగి న్యూఢిల్లీ చేరుకున్నారు.
* 56 రోజుల పాటు రాహుల్ సెలవు పెట్టారని నాడు వార్తలు వినిపించాయి. అయితే వాస్తవానికి రాహుల్ గాంధీ సరిగ్గా 60 రోజుల పాటు సెలవులో ఉన్నారు.
(Source: India Today)
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more