దాయాధి దేశం పాకిస్థాన్.. భారత్ తో కుదుర్చుకున్న సరిహద్దు కాల్పుల విరమణ ఓప్పందాలను తుంగలో తొక్కుతూ.. నిత్యం రావణ కాష్టంలా సరిహద్దు ప్రాంతాలు, గ్రామాలపై తుపాకీ గుళ్ల వర్షం కురిస్తుండగా, సరిహద్దులోని గ్రామాలను ఖాళీ చేసి సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలసలు వెళ్తున్న నేపథ్యంలో.. ధైర్యం చేసి మరీ ఆ ప్రాంతాలకు వెళ్లి మరీ ఆనందాన్ని పోందుతున్నారు పర్యాటకులు. భారత సరిహద్దులకు వస్తున్న టూరిస్టుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్ఎస్ పురా సెక్టారుకు నిత్యమూ వందలాది మంది టూరిస్టులు వచ్చి పోతున్నారు. వీరంతా సరిహద్దుల వద్ద ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. సైనికులు ఉండే బంకర్లలోకి కూడా వెళ్లి వారితో కలిసి చిత్రాలు తీయించుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెరిగాయి.
ఇక్కడికి రావడం, కనుచూపు మేరలో పాక్ జెండాలు కనిపిస్తుండటం, పక్కనే భారత జెండాలు రెపరెపలాడుతుండటం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఉత్తరాఖండ్ నుంచి టూరిస్టులుగా వచ్చిన షెల్జా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వున్న బంకర్లు చూడాలన్న తన కోరిక ఇన్నాళ్లకు తీరిందని తెలిపారు. రెండు రోజుల క్రితం తాము తుపాకుల చప్పుళ్లను విన్నామని, ఈ ప్రాంతాన్ని చూడాలన్న కోరికను తీర్చుకునేందుకే వచ్చామని పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి ప్రాంతం నుంచి వచ్చిన కిషన్ లాంబా వివరించారు. వీరిలానే బార్డర్ వద్దకు వచ్చి రెండు రోజులుండి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో, వీరి భద్రత సైన్యాధికారులకు కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. మరి ఈ తరంలో సెల్ఫీల మోజు ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే కదా?!
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more