భారత చరిత్రలో మన జాతిపిత మహాత్మా గాందీ తర్వాత అధికంగా భారతీయులు ఇష్టపడే వారు ఎవరూ అంటే నరేంద్ర మోదీ. నిజానికి భారతీయుల కంటే కూడా ప్రపంచంలో గాంధీ తర్వాత అతిగా ఇష్టపడే వారిలో మోదీ చోటుదక్కించుకోవడం విశేషం. వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జాబితాలో జాత్యహంకార వ్యతిరేక పోరాట యోధుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అగ్రస్థానంలో నిలిచారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ నాలుగో స్థానంలో ఉన్నారు. మోదీకి పదో స్థానం లభించింది. వెయ్యి మంది ప్రముఖ వ్యక్తులను తీసుకొని అందులో అతిగా ఆదరణ ఉన్న వారిని టాప్ ఆర్డర్ ఇచ్చారు.
ఈ సర్వేలో 125 దేశాల్లోని 285 నగరాలకు చెందినవారు పాల్గొని అభిప్రాయాలు చెప్పారు. రెండో స్థానం పోప్ ఫ్రాన్సిస్కు దక్కింది. తదుపరి స్థానాల్లో టెస్లా మోటార్స్ సీఈవో ఎలోన్ ముస్క్ (మూడవ స్థానం), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ (5), అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా (6), వర్జిన్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బార్సన్ (7), యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ (8), నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్(9) ఉన్నారు. 125 దేశాల్లోని 285 నగరాల్లో ఈ సర్వేను నిర్వహించి.. ఫైనల్ గా టాప్ పది మంది ఆదరణ గల వ్యక్తుల పేర్లును వెల్లడించింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మొత్తానికి దేశవిదేశాలు తిరిగి భారత కీర్తి పథాకాలను ఎగరవేస్తున్న మోదీకి గాంధీ తర్వాత అంతటి గుర్తింపు లభించడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more