అన్యోన్యంగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్న ఓ కుటుంబాన్ని ‘మద్యం రక్కసి’ ఛిద్రం చేసింది. సంతోషంగా వున్న ఆ కుటుంబ వాతావరణాన్ని విషాదంగా మార్చింది. తన భర్త మద్యానికి బానిసై ఆ మత్తులోనే తూగుతుంటే.. దాన్ని వదిలేయాల్సిందిగా భార్య ఎన్నోసార్లు నచ్చజెప్పింది.. వేడుకుంది.. అయినప్పటికీ అతని తీరు మారలేదు. దాంతో విసిగిపోయిన ఓ తల్లి తన పిల్లల్ని కడతేర్చి తానూ ఆత్మహత్య చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై కీల్పాకంకు చెందిన సంతోష్ స్టీల్స్ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి రవాణా కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇతనికి మమత(34) అనే మహిళతో చాలాకాలం క్రితమే పెళ్లయ్యింది. ఆ దంపతులకు యాసి(12), అనుష్(7) అనే ఇద్దరు పిల్లలు వున్నారు. యాసి ఏడో తరగతి, అనుష్ రెండో తరగతి చదువుతున్నారు. ఎంతో ఆహ్లాదంగా, ఆనందంగా సాగుతున్న ఈ కుటుంబంలోకి మద్యం రక్కసి ప్రవేశించింది. అసలు మద్యం వాసన రుచిమరగని సంతోష.. ఇటీవలకాలంగా మద్యం తాగడం మొదలెట్టాడు. ఆ మత్తు అతనికి గమ్మత్తునివ్వడంతో రోజూ తాగడాన్ని అలవాటు చేసుకున్నాడు. నిత్యం మద్యం మత్తులో ఉండే భర్తను పలు మార్లు మమత మందలించింది. అయినా.. అతడిలో మార్పు రాలేదు. దీంతో వారి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో వచ్చిన సంతోష్, మమతల మధ్య పెద్ద గొడవే జరిగింది. గురువారం కూడా మరో మారు ఇద్దరి మద్య వివాదం సాగింది. మద్యం మానకుంటే పిల్లల్ని చంపి, తాను చస్తానంటూ మమత హెచ్చరించినా, సంతోష్ పెద్దగా పట్టించుకోలేదు. తన భర్త మద్యం చిత్తుతో విసిగి వేసారిన మమత అనుకున్న పని చేసి తీరింది.
గురువారం సాయంత్రం తీవ్ర మనో వేదనకు గురైన మమత... స్కూల్ నుంచి వచ్చిన కుమార్తె యాసిని, కుమారుడు అనుష్ ను తన పావడా నాడాతో గొంతు బిగించి చంపేసింది. అనంతరం ఆమె కూడా మదుమేహ వ్యాధి గ్రస్తులు ఉపయోగించే మాత్రలు పెద్ద సంఖ్యలో మింగేసింది. తీవ్ర అస్వస్థతో స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్న మమత.. తనసోదరి కౌశల్యకు ఫోన్ చేసి తన పిల్లల్ని చంపేశానని, తాను చచ్చి పోతున్నానంటూ ఫోన్ చేసి కట్ చేసింది. ఆందోళన చెందిన కౌశల్య అక్కడి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో పాటుగా, కీల్పాకంలోని మమత ఇంటికి పరుగులు తీశారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న మమతను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. పిల్లలు ఇద్దరు మరణించి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో మమతకు స్పృహ రావడంతో.. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణాలేంటో వాంగ్ములం తీసుకున్నారు. శుక్రవారం ఉదయాన్నే పోస్టుమార్టం అనంతరం ఆ ఇద్దరు పిల్లల్ని తండ్రి సంతోష్కు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more