తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ చేసిన కృషితో ఎంతోమంది తెలంగాణవాళ్లకు కేసీఆర్ దేవుడయ్యాడు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం.. క్షేత్ర స్థాయి నుండి ఉద్యమాన్ని ఉదృతం చేయడం వల్ల కేసీఆర్ చిరకాలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయగలిగారు. కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించిన తీరు.. ఉద్యమాన్ని ప్రత్యేక రాష్ట్రం సాధనదిశగా నడిపించిన తీరు ప్రశంసనీయం. అయితే తాజాగా ఏపిలో కూడా ఓ ఉద్యమం నడుస్తోంది. అన్యాయంగా జరిగిన విభజనకు బలైపోయిన ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత కొంత కాలంగా నిశబ్దంగా విప్లవం సాగుతోంది. అయితే అక్కడి ప్రజలు ప్రత్యక్షంగా ఉద్యమానికి ప్రస్తుతానికి పూనుకోకపోయినా.. ప్రత్యేక హోదా కావాలన్న కోరిక మాత్రం అక్కడి వాళ్లలో ఉంది. అయితే జగన్ ప్రత్యేక హోదా మీద దీక్షకు దిగారు. నాలుగు రోజులుగా జగన్ దీక్ష చేస్తున్నారు. అయితే కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన దీక్ష సక్సెస్ అయింది.. మరి జగన్ చేస్తున్న దీక్ష సక్సెస్ అవుతుందా అన్నది చూడాలి.
తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన ఘనత కేసీఆర్ సొంతం. ఎన్నో దశాబ్దాలుగా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేసీఆర్ ముగింపునిస్తూ.. కొత్త రాష్ట్రానికి ఊపిరిపోశారు. అయితే కేసీఆర్ అలా దేవుడు కావడం వెనక కొంత మంది కీలక పాత్ర ఉంది. అయితే ఓ వర్గం వాళ్లు చేసిన పనితో కేసీఆర్ దేవుడయ్యారు. ఎవరు వాళ్లు అనుకుంటున్నారా..? స్టూడెంట్స్. అవును విద్యార్థుల వల్లే కేసీఆర్ దేవుడయ్యాడు. ఎలా అంటారా..? కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కానీ కొన్ని రోజులకే కేసీఆర్ వెనక్కితగ్గారు. తన దీక్షను అర్దంతరంగా విరమించుకున్నారు. అయితే తెలంగాణ విద్యార్థులు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. దాంతో రాత్రికి రాత్రి సీన్ మారిపోయింది.. కేసీఆర్ ఖచ్చితంగా దీక్ష చెయ్యాల్సి వచ్చింది... వేరే ఆప్షన్ లేకుండా విద్యార్థులు కట్టుదిట్టం చేశారు. దాంతో చేసేదేం లేక చివరకు కేసీఆర్ గత్యతరంలేని పరిస్థితుల్లో తిరిగి దీక్షకు దిగారు.
అలా కేసీఆర్ ను నాయానో భయానో తెలంగాణ ప్రజల పాలిట దేవుడిని చేసిన క్రెడిట్ తెలంగాణ విద్యార్థులదే. మరి తాజాగా వైయస్ జగన్ ప్రత్యేక హోదా మీద దీక్షకు దిగారు. నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నా కానీ ఏపిలొ ఇంకా అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదు. ఏపి రాజధాని అమరావతి శంఖుస్థాపనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండటంతో అక్కడ జగన్ దీక్షకు తగిన విధంగా స్పందన రావడం లేదు. అయితే జగన్ చేస్తున్న దీక్ష హైలెట్ కావాలంటే విద్యార్థులు ఎంతో కీలకం. ఎందుకంటే ఒకవేళ విద్యార్థులు గనక రంగంలోకి దిగితే మాత్రం ఏపికి ప్రత్యేక హోదా వెంటనే వచ్చేస్తుంది. ఒకటి జగన్ దీక్షకు విద్యార్థులు గనక మద్దతుగా నిలిస్తే అది ఖచ్చితంగా ఉద్యమంలా తీవ్రవరమై ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక హోదా మీద పాజిటివ్ గా ప్రకటన వస్తుంది. అలాకాకపోయినా విద్యార్థులు రంగంలోకి దిగితే కేసీఆర్ లాగా జగన్ కూడా దీక్ష మధ్యలో వదల్లేరు దాంతో చివరకు ఎలాగోలా ప్రత్యేక హోదా మీద ప్రకటన వస్తుంది. అలా జగన్ కూడా ఏపి ప్రజల పాలిట దేవుడు అవుతారు. మరి కేసీఆర్ కు విద్యార్థులు ఇచ్చిన ట్రీట్ మెంటే జగన్ కు కూడా ఏపి విద్యార్థులు ఇస్తారా అన్నది చూడాలి. ఒకవేళ అలా గనక జరిగితే జగన్ ఏపి ప్రజలకు ఖచ్చితంగా ‘దేవుడు’ అవుతాడు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more