పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఆదివారం కోన గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న టీడీపీ పార్టీ.. తమ అమాత్యుడితో పాటు పార్లమెంటు సభ్యుడికి జరిగిన పరాభవంపై ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా ప్రతిపక్షం అందులోనూ అసెంబ్లీలో ఎలాంటి ప్రాతినిథ్యం లేని పార్టీని రాష్ట్ర అధ్యక్షుడిపై రఘువీరారెడ్డిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బందరు పోర్టుకు తమ భూములు ఇవ్వమంటూ భీష్మించుకున్న కోన గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు రఘువీరారెడ్డికి ఆదివారం ఆ గ్రామానికి వెళ్లారు. ఆ క్రమంలో స్థానిక గ్రామస్తులతో సమావేశమయ్యారు.
అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తుల, ఆ పార్టీ సానుభూతి పరులు... రఘువీరారెడ్డిపై ఇసుక, రాళ్లతో దాడి చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి... టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. కాగా క్రితం రోజున బందరు పోర్టు భూములను ఇమ్మించేందుకు ఒప్పిస్తామని ధీమగా వెళ్లిన అమాత్యులు కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణను స్థానికులు గ్రామ శివార్ల వరకు తరమికోట్టారు. ఈ నేపథ్యంలో తమ నేతలకు జరిగిన పరాభావంపై ప్రతీకారం తీర్చుకునే పనిలో భాగంగా స్థానికులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన రఘువీరాపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే తమ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటూ నిత్యం అదే డైలాగును వల్లే వేసే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి..!
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more