బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆదర్శాల కోసం కృషి చేయాలని దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపు నిచ్చారు. శనివారం 69వ భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతినుద్దేశించి ప్రసంగించారు. భారతీయులు ఆత్మగౌరవం కోసం స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేశారని ఆయన వివరించారు. మనకు పటిష్ఠమైన రాజ్యాంగం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైనదని ఈ సందర్భంగా ప్రణబ్ పేర్కొన్నారు. విలువైన చర్చలకు వేదికగా పార్లమెంట్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే విద్య, ఉద్యోగాలు మహిళలకు అందేలా చట్టాలను మార్చుకున్నామని చెప్పారు.
ప్రాచీనమైన చట్టాలను రద్దు చేసి మన అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చుకున్నామని ప్రణబ్ ఈ సందర్భంగా విశదీకరించారు. మానవునికి - ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా ప్రణబ్ వివరించారు. తీవ్రవాదులకు మతం, సిద్ధాంతం, భాష అంటూ ఏమీ లేవన్నారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించ కూడదని పొరుగు దేశాలు గుర్తించాలన్నారు. ఇటీవల కశ్మీర్లో పాక్ ఉగ్రవాది నవీద్ను పట్టుకున్న పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.భారత్ - బంగ్లాదేశ్లో మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదం పరిష్కారమైందన్నారు.
దేశంలోని రాజకీయ పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. పదేళ్లుగా దేశ ఆర్థిక ప్రగతి ప్రసంశనీయంగా ఉందని అన్నారు. మనకు పటిష్టమైన రాజ్యాంగం ఉందని ప్రణబ్ వ్యాఖ్యానించారు. నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థికి ఆయన అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్య సంస్థలు ఒత్తిడిలో ఉన్నాయని ప్రణబ్ ఈ సందర్భంగా పేర్కోన్నారు. పార్లమెంట్ చర్చలకు వేదికగా ఉండాలని, యుద్ధరంగాన్ని తలపించడం మంచిదికాదని ఆయన అభిప్రాయపడ్డారు. 7.3 శాతం వృద్ధి రేటు సాధించామని ఆయన అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more