కాంగ్రెస్ యువనేత, అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి న్యూఢిల్లీలో పరాభవం ఎదురైంది. ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ విధానాన్ని అమలు కోరుతూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మాజీ సైనికులు చేపట్టిన దీక్షస్థలి వద్ద రాహుల్ గాంధీకి చేధు అనుభవం ఎదురైంది. అయితే రాజకీయమే తెలియదని, విజ్ఞానం లేని నిపుణుడని అరోపణలు చేసిన అధికార పక్షం ఖంగు తినేలా ఆయన చాలా హుందంగా అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ విధానం అమలు చేయాలని మాజీ సైనికులు అందోళన చేపట్టిన సభా వేదికకు వచ్చి తన మద్దతును తెలిపేందుకు రాహుల్ గాంధీ వచ్చారు. అయితే రాహుల్ గాంధీని రాహుల్ వెళ్లిపో అన్న స్లోగన్స్ స్వాగతం పలికాయి.
పవిత్రమై తమ ఆందోళనను కేవలం ఫోటో సెషన్ గా మార్చవద్దని ఒక అందోళనకారుడు బిగ్గరగా అరిచాడు. దీంతో పలువురు రాహుల్ గాంధీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడి నుంచి వెనుదిరిగిన రాహుల్.. ప్రధాని మాజీ సైనికుల డిమాండ్లను ఎప్పటి లోగా పరిష్కరిస్తారో చెబుతూ.. ఒక తేదీని వెంటనే వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో మాజీ సైనికుల ఉద్యమాలు చల్లారుతాయన్నారు. తాను ఒక పార్టీకి ప్రతినిధిగా ఇక్కడకు రాలేదని, తమ యవ్వనాన్ని భారత సరిహద్దులో గడిపి అనునిత్యం భారత మాత సేవలో గడిపిన మాజీ సైనిక ఉద్యోగులు, జవాన్లు అందోళన చేయడంతో చెలించి తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. వారిని నిరసనను వ్యక్త పర్చకుండా ఇక్కడి నుంచి తరమివేయాలని పోలీసులు యత్నించడాన్ని తప్పుబట్టారు.
దేశం కోసం శ్రమించిన జవాన్ల అవసరాలను తీర్చడం, హామీలను నిలబెట్టుకోవడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పుకోచ్చారు. అంతకు ముందు మాజీ సైనికులు చేస్తున్న ఆందోళనను పోలీసులు చెదరగోట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు మోడీ సర్కారుకు వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా మాజీలు బ్లాక్ ఇండిపెండెన్స్ డే అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత కూడా చోటుచేసుకుంది. దీనిని గమనించే తాను అక్కడికి వచ్చానని రాహుల్ గాంధీ చెప్పుకోచ్చారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more