ఉగ్రవాది యాకుబ్ మెమెన్ కు గత నెల 30వ తేది భారత సుప్రీంకోర్ట్ ఉరి శిక్ష విధించింది. ముంబై వరుస పేలుళ్లకు కారణమైన యాకుబ్ మెమెన్ ను ఉరి తీయాల్సిందిగా భారత అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై పేలుళ్ల దాడికి ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన యాకుబ్ మెమెన్ కు 20 ఏళ్ల తర్వాత ఉరి శిక్ష విధించింది. యాకుబ్ మెమెన్ ఉరి సమయంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి ఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. మెమెన్ ఉరిని ఆపడానికి జరిగిన ప్రయత్నాలు.. అర్దరాత్ర సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకోవడం ఇలా ఎన్నో విశేషాలు యాకుబ్ మెమెన్ ఉరి నేపథ్యంలో జరిగాయి. అయితే మెమెన్ ఉరి కంటే ముందే అతని అన్న, టైగర్ మెమెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. తాజాగా టైగర్ మెమెన్ యాకుబ్ మెమెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
ముంబై వరుస బాంబ్ పేలుళ్లకు పథక రచన చేసిన కీలక సూత్రధారుల్లో యాకుబ్ మెమెన్ ఒకరు. దావూద్ ఇబ్రహీం,. టైగర్ మెమెన్, యాకుబ్ మెమెన్, మెమెన్ ఖాన్ లు ముంబై వరుస పేలుళ్లకు కారణమయ్యారు. అయితే అందులో కేవలం యాకుబ్ మెమెన్ ను మాత్రమే పట్టుకున్న ఇండియా అతడిని ఉరి తీసింది. అయితే యాకుబ్ మెమెన్ ను ఉరి తియ్యడానికి కొద్ది గంటల ముందు అతడి కుటుంబ సభ్యులతో దాదాపు గంటన్నర మాట్లాడినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మెమెన్ ఉరికి తగిన ప్రతీకారం తీర్చుకుంటామని టైగర్ మెమెన్ వారితో అన్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే రోజు మెమెన్ ఉరితీత మీద విచారణ చేసిన ధర్మాసనం న్యాయమూర్తుల్లో ఒకరైన దీపక్ మిశ్రాకు బెదిరింపే లేఖ అందింది. ఎంత సెక్యూరిటీని పెంచుకున్నా చంపితీరుతామని అందులో ఉంది. ఇలా ఉగ్రవాదులు ప్రతీకారానికి సిద్దంగా ఉన్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more