దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. అంతేకాదు.. అత్యధిక కలెక్షన్లు సాధించిన దక్షిణాది సినిమాగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ‘బాహుబలి’ సినిమాలో శివుడి(ప్రభాస్)కి ఫ్లాష్ బ్యాక్ చెప్పిన అనంతరం ముగింపు సందర్భంగా తానే ‘బాహుబలి’ని చంపానని కట్టప్ప (సత్యరాజ్) చెబుతాడు. అతను ఎందుకు చంపాడోనన్న రహస్యం తెలుసుకోవాలంటే.. ఈ సినిమా రెండో పార్ట్ వరకు ఆగాల్సిందే. కానీ.. ఇంతలోనే ఈ విషయమే సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసలు ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ఆ ప్రశ్నపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు, జోకులు, రకరకాల కామెంట్లతో సందడి చేస్తున్నారు. వాటిల్లో జోరుగా ప్రచారమవుతున్నవి రెండు కామెంట్లు వున్నాయి. అవేమిటంటే.. ‘బాహుబలి-ది బిగినింగ్’లో కట్టప్ప ప్లేటులో భోజనం చేసిన బాహుబలి, అతనిని మామా అని సంబోధించి అభిమాన పాత్రుడవుతాడు. అలా ప్రతిసారి కట్టప్ప దగ్గర భోజనం చేయడం బాహుబలి అలవాటుగా మార్చుకుంటాడు. అయితే.. ఓసారి ఆకలిగా తింటున్న కట్టప్ప ప్లేటును బాహుబలి లాగేసుకుంటాడు. దీంతో తీవ్ర కోపాద్రిక్తుడైన కట్టప్ప.. బాహుబలిని అంతమొందించ్చాడంటూ కొందరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఇక రెండో జోక్ విషయానికొస్తే.. ‘మిర్చి’ సినిమాలో తన భార్య మరణానికి ప్రభాస్ కారణమని తెలుసుకున్న సత్యరాజ్.. బాహుబలి చిత్రంలో కట్టప్పగా మారి, బాహుబలిని చంపేసి తన ప్రతీకారం తీర్చుకున్నాడంటూ సరదాగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
కేవలం ఇవి మాత్రమే కాదండోయ్.. ఆ ప్రశ్నపై ఇంకా ఎన్నో జోకులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడోనన్న ప్రశ్న సోషల్ మీడియాలో ‘క్వశ్చన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రశ్నపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మరిన్ని జోకులు మీకోసం...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more