బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన ‘భజరంగీ భైజాన్’ చిత్రం ఇటీవలే విడుదలై బ్రాహ్మాండమైన విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఇక ఇందులో సల్మాన్ నటించిన పాత్ర అతని జీవితంలో అద్భుతమైందంటూ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. అలాగే.. సల్మాన్ తోపాటు నవాజుద్దీన్ సిద్ధిఖీ పాకిస్థాన్ జర్నలిస్ట్ పాత్రను ఎంతో బాగా పోషించాడంటూ ప్రేక్షకులు కితాబిచ్చారు. ఈ పాత్ర జర్నలిస్ట్ గా హాస్యం పంచి, భజరంగీకి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ జర్నలిస్ట్ పాత్ర సినిమాకి వెన్నముకలా సహకరించింది. నిజానికి ఈ పాత్రకు స్ఫూర్తి పాకిస్థాన్ లోని జర్నలిస్టుగా విధులు నిర్వహిస్తున్న చాంద్ నవాబ్ కావడం విశేషం. పైగా.. అతని పేరునే ఈ పాత్రకు కూడా పెట్టారు. దీంతో అతని ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒక సాధారణ జర్నలిస్టుగా వుండే అతను ఇప్పుడు స్టార్ గా మారిపోయాడు.
ఇదిలావుండగా.. ఈ సినిమా ఘనవిజయం సాధించన సందర్భంగా ఆ జర్నలిస్ట్ చాంద్ నవాజ్ పాకిస్థాన్ లోని ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడాడు. ‘భజరంగీ భైజాన్’ సినిమాలో తన పేరు వినియోగించుకుని.. తనకు గొప్ప పాప్యులారిటీ తెచ్చిన సల్మాన్ ధన్యవాదాలని పేర్కొన్నాడు. ఇటువంటి గౌరవం తనకు జీవితంలో దక్కుతుందని ఎప్పుడూ భావించలేదని తెలిపాడు. ఇంతవరకు బాగానే వుంది కానీ.. తన పేరు వినియోగించుకున్నందుకు మాత్రం తనకు పరిహారం ఇవ్వాలని అతగాడు డిమాండ్ చేస్తున్నాడు. ‘తన పేరు వాడుకున్నందుకు పరిహారం ఇచ్చే వీలు లేదా?’ అని ఏకంగా సల్మాన్ నే ప్రశ్నిస్తున్నాడు. తానొక పేద జర్నలిస్టునని, తన పేరు వినియోగించునందుకు గాను పరిహారం పొందెందుకు చట్టాలు, న్యాయస్థానాల చుట్టూ తిరగలేనని నవాబ్ చెబుతున్నాడు. కాబట్టి.. తనకు రావాల్సిన పరిహారాన్ని సల్మాన్ ఖాన్ ఎలాగైనా ఇప్పించాలని, అతగాడు కోరుకుంటున్నాడు. మరి.. సల్మాన్ ఖాన్ ఆ జర్నలిస్టు కోరుకున్నట్లు పరిహారం ఇస్తాడా..? లేదా..? వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more