అమెరికా అధ్యక్ష పదవికి 2016లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన బాబీ జిందాల్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన వెబ్సైట్లో ప్రకటించడంతోపాటు ట్విటర్లోనూ ట్వీట్ చేశారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన జిందాల్ ప్రస్తుతం లూసియానా రాష్ట్రం గవర్నర్గా ఉన్నారు. న్యూ ఆర్లేన్స్లో త్వరలో జరిగే బహిరంగ సభలో తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆయన లాంఛనంగా ప్రకటించనున్నారు. అపారమైన పాలనా అనుభవంతోపాటు సమర్థుడైన నాయకుడిగా పేరుతెచ్చుకున్న బాబీ జిందాల్ రేసులో అందరికంటే ముందున్నారు. పైగా ప్రస్తుతం అత్యంత ప్రధానమైన రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్ కు ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తూన్నారు. అంతేకాదు విధాన పరమైన అంశాల్లో ప్రత్యర్థి డెమోక్రాట్ పార్టీని చీల్చి చెండాడటంలో రిపబ్లికన్ల తరఫున బాబీని మించిన వ్యక్తి ఎవరూ లేరు. ఇప్పటికే ఆయనకు 'వోకల్ క్రిటిక్ ఆఫ్ ఒబామా' అనే పేరుంది. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ ను ఇప్పటికే తన విమర్శనాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు బాబీ జిందాల్.
తాను ఎందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నదీ ఆయన ఈ సందర్భంగా వివరించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి పోటీ చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే ఒక రాష్ర్టానికి గవర్నర్గా ఎన్నికైన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా జిందాల్ రికార్డు సృష్టించారు. ఆయన ప్రస్తుతం రెండో దఫా ఈ పదవి నిర్వహిస్తున్నారు. దీనితోపాటు అత్యంత శక్తిమంతమైనదిగా భావించే రిపబ్లికన్ గవర్నర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవిని కూడా జిందాల్ ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. లూసియానా గవర్నర్ కావడానికి ముందు ఆయన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు రెండు సార్లు ఎన్నికయ్యారు. అయితే.. ఆయన ప్రకటన అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో అంత ఉత్సాహాన్ని రేకెత్తించలేకపోవడం విశేషం.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more