‘కిక్’ సినిమాలోని ఈ డైలాగ్.. ఓ పిచ్చివాడిని వర్ణించేందుకు ఉపయోగించబడింది. తెలివిగా వుండే మనిషి మెదడు దెబ్బతిన్న తర్వాత పిచ్చివాడిలా మారిపోయాడని దాని అర్థం! ఇప్పుడు ఈ డైలాగ్ తాలిబన్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు బాగానే సూటవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. అగ్రరాజ్యాలను తమ అధీనంలో వుంచుకోవాలని ఆ ఉగ్రవాద సంస్థలు ఎప్పటినుంచో పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! అటువంటి ఆ సంస్థలు.. ఇప్పుడు అవే కొట్టేసుకుంటున్నాయి. పగ, ప్రతీకారాలను ఆ ఉగ్రవాదులు తమ మీదే ప్రదర్శించుకుంటున్నారు. ఒకర్నొకరు చంపేసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. దాదాపు నెలరోజులుగా జలాలాబాద్ కు తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాలిబన్లను లక్ష్యంగా చేసుకుని పోరాటం జరుపుతున్నాయి. వారిలో దొరికొన వారిని దొరికినట్లు హతమారుస్తూ ముందుకెళ్తున్నాయి. ఐఎస్ఐఎస్ ఇప్పటికే తాలిబన్లకు చెందిన ప్రాంతంలో చాలా దూరం చొచ్చుకు వచ్చేశారని మహమ్మద్ సిద్ధిక్ అనే పాక్ ఆదివాసీ నేత తెలిపారు. జీహాదీలకు నాయకత్వం వహించిన ముల్వీ అబ్బాస్ తో పాటు మరో 10 మంది తాలిబన్లను ఐఎస్ఐఎస్ బందీలుగా చేసుకుని వారి తలలను నరికిందని ఆఫ్ఘన్ ఆర్మీ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తాలిబన్ల ప్రాబల్యమున్న ప్రాంతంలో పట్టు సాధించేందుకు యత్నిస్తున్న ఐఎస్ఐఎస్.. దొరికినవారిని దొరికినట్టు మట్టుబెట్టేస్తున్నారు. తమ ఉగ్రవాద సంస్థను మరింత బలపర్చుకోవడం కోసమే ఐఎస్ఐఎస్ ఇలా తాలిబన్లపై సైతం విరుచుకుపడుతోంది.
ఇదిలావుండగా.. ఈ ఐఎస్ఐఎస్, తాలిబన్ల మధ్య జరుగుతున్న పోరాటాలను అగ్రరాజ్యాలు నిశితంగా గమనిస్తున్నాయి. వాళ్లలో వాళ్లు కొట్టుకుని చస్తే.. మిగిలిన వారిని మట్టుబెట్టవచ్చునన్న అభిప్రాయంతో వున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఆ రెండు ఉగ్రవాద సంస్థల మధ్య జరుగుతున్న పోరాటాల నడుమ సాధారణ ప్రజలు దారుణంగా బలైపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more