తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలొ పోటీ పడాలి అనుకున్న తెలుగు వారి కల .. కలాలానే ఉండపోతోందా..? పోటీ అంటే కుట్రలు కుత్రంత్రాలేనా..? అన్నట్లు ప్రస్తుతం తెలంగాణ, ఏపిల మధ్య వివాదాలు రాజుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏపి సిఎం చంద్రబాబు నాయుడును దోషిగా నిలబెట్టాలని చూస్తున్న తెలంగాణ సర్కార్ పై ఏపి సర్కార్ గుర్రుగా ఉంది. ఏపి సర్కార్ తాజాగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ సంభాషణలు మా వద్ద ఉన్నాయని ఇప్పటికే ప్రకటించారు.
దాంతో తెలంగాణ పోలీసులు ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న సమాచారాన్ని సేకరించడంలో ప్రస్తుతం ఏపీ పోలీస్ వర్గాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆధారాలు దొరికితే, అవసరమైతే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై కేసు నమోదుకు కూడా వెనకాడరాదని పోలీస్ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కొన్నేళ్ల కిందట కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన పదవికి రాజీనామా చేయడానికి దారితీసిన సమాచారాన్ని కూడా తెప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు ఏపి, తెలంగాణగా విడిపోయినా కానీ ప్రభుత్వ కార్యకలాపాలాను మాత్రం హైదరాబాద్ నుండే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల ఫోన్లను గత కొంత కాలంగా ట్యాపింగ్ చేస్తున్నారని ఏపీ పోలీసు అధికారులు ఇప్పటికే నిర్థారణకు వచ్చారు. అదే సమయంలో, ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లలో ఎవరెవరితో ఏమేం మాట్లాడారో.. ఆ సమాచారమంతా తమ వద్ద ఉందన్న కోణంలో టీఆర్ఎస్ నేతలు, మంత్రులు చేస్తున్న ప్రకటనలను ఏపీ పోలీస్ వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్తోపాటు ఆయన చుట్టూ ఉన్నవారు, కొందరు అధికారులు, ఆయనతో సన్నిహితంగా ఉండేవారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న సమాచారం ఏపి పోలీసుల వద్ద ఉంది. దీనిపై ఇప్పటికే డీజీపీ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే రాజీనామా చేసిన వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఏపీ పోలీస్ వర్గాలు సేకరిస్తున్నాయి. అప్పట్లో రామకృష్ణ హెగ్డే రాజకీయ ప్రత్యర్థులు ఫోన్లలో మాట్లాడుకొన్న విషయాలు పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. దీనిపై పెద్ద వివాదం చెలరేగింది. ఆ లీక్ వెనక హెగ్డే ఉన్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెప్పించి అధ్యయనం చేయాలని ఏపీ పోలీసులు నిర్ణయించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more