'కలిసి పనిచేయండి.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించండి.. లేదంటే మీ ఇద్దరి పదవులు పీకుతా, పరిస్థితిని అంతవరకూ తెచ్చుకోరనే భావిస్తున్నాను' సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తన కేబినెట్లో పనిచేస్తున్న ఇద్దరు మంత్రుల ఉద్దేశించి చేసిన వాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత జిల్లా నుంచి సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాస రావులకు కేబినెట్లో స్థానం కల్పించారు. అప్పటికే భిన్న ధృవాలుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తమ తీరు మార్చుకోలేదు. ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అనే పరిస్థితిలను జిల్లాలో తీసుకువచ్చారు. పలు సందర్భాలో వీరి మధ్య ఆధిపత్యపోరు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. మధ్యవర్తులు హితోపదేశం చేసినా తీరు మారకపోగా, సాక్షాత్తు అధినేతే జోక్యం చేసుకునేంత వరకూ వచ్చింది.
తాజాగా నగరంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో కూడా ఇదే అంశంపై అధినేత నోరు విప్పాల్సి వచ్చింది. అయితే ఈ సారి అధినేత డాంభికాన్ని ప్రదర్శించి ఊరుకోలేదు. కార్యకర్తల సాక్షిగా ఇద్దరు మంత్రులనూ సూటిగానే హెచ్చరించారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని లేదంటే ఇద్దరూ పదవులు కోల్పోతారంటూ కఠినంగానే హెచ్చరించడం తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించింది. ఒకప్పుడు నాకు మొహమాటాలుండేవి, ఇప్పుడు వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటూనే ఇద్దరూ సమర్ధులన్న ఉద్దేశంతో తాను కేబినెట్లో స్థానం కల్పించానని లేదంటే అంటూ ముక్తాయింపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని మంత్రి అయ్యన్న, విశాఖ నియోజకవర్గాన్ని గంటా సమన్వయం చేసుకోవాలని సూచించారు. కతెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అత్యాశాపరులు లేరని, ఒకటి రెండు శాతం మంది కార్యకర్తలు అటువంటి వారున్నప్పటికీ వారికి నచ్చచెప్పి సమన్వయం చేసుకోవాలన్నారు. మీ పరోక్షంలో మీలోమీకు చాడీలు చెప్పే కార్యకర్తలను దూరంగా పెట్టాలని హితవు పలికారు. మీరు ఆదర్శంగా పనిచేస్తే కార్యకర్తలు అదేరీతిలో నడచుకుంటారని అన్నారు. కార్యకర్తలు కోరుకుంటున్న విధంగా వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని మంత్రులు అయ్యన్న, గంటాలకు సిఎం చంద్రబాబు సూచించారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more