కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ గోవాలోని కాండోలిమ్ ప్రాంతంలో గల ప్రముఖ వస్త్ర దుకాణం గుట్టును రట్టుచేసింది. దేశవ్యాప్తంగా శాఖోపశాఖలున్న వస్త్ర నిలయం ఫ్యాబ్ ఇండియాలోకి వెళ్లిన మంత్రి స్మృతి ఇరానీ.. ఓ వస్త్రాన్ని తీసుకుని డ్రెస్ చేయింగ్ రూం, వస్త్రాలు మార్చుకునే గదిలోకి వెళ్లింది. అక్కడ పరిశీలించగా అమెకు హిడెన్ కెమెరాలు కనిపించాయి. చాలా ఎత్తైన ప్రదేశంలో గోడ లోపల వాటిని అమర్చారు. అయితే ఆ కెమెరాల లెన్సులు మాత్రం చేజింగ్ రూం లోపలి దృశ్యాలను చిత్రీకరించేందుక వీలుగా అమర్చారు. వెంటనే బయటకు వచ్చిన అమె వాటిని పరిశీలించి, అవి నిజంగానే హిడెన్ కెమెరాలని నిర్ధారించుకుని షాక్ కు గురైంది.
తక్షణం చేయింగ్ రూమ్ నుంచి వెలుపలకు వచ్చి.. అక్కడే వున్న తన భర్తకు విషయాన్ని చెప్పింది. వెంటనే కాలనగూట్ బీజేపి ఎమ్మెల్యే మైఖేల్ లోబోకు కూడా విసయాన్ని చెప్పింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే పోలీసులను వెంటబెట్టుకుని పరుగుపరుగున షాపింగ్ కాంప్లెక్స్ కు చేరుకున్నారు. పోలీసులు వచ్చి రావడంతోనే లోపల వున్న కస్లమర్లను బయటకు పంపి, దుకాణాన్ని, సీసీ కెమెరాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్ సహా పలు వస్తువులను సీజ్ చేశారు. దుకాణ మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పటికే స్మృతి ఇరానీ ఆ ప్రాంతాన్ని వదలి బాగాలోని తాను బస చేసిన ప్రాంతానికి చేరుకుంది. అక్కడికి వెళ్లిన స్తానిక పోలీసు ఇన్స్ పెక్టర్.. నిలేష్ రాణేకు తన వాంగ్మాలాన్ని ఇచ్చింది. దుకాణాదారులు చెప్పే కట్టుకధలు నమ్మకండి, ఇది అంతటా జరుగుతోంది. ఆడవారు వస్త్రాలను మార్చుకునే క్రమంలో వీడియోలను తీసి.. ఆ తరువాత వారి పరువును బజారు పాలు చేస్తున్నారని మంత్రి తన వాంగ్మూలం కూడా ఇచ్చింది. దానిని పరిశీలించగా గత నాలుగు నెలలుగా ఆ కెమెరాలతో ఆడవారి వస్త్రాలు మార్చుకునే వీడియోలు రికార్డ చేసినట్లుగా వున్నాయని ప్రాధమిక సమాచారం. కేవలం రెండు రోజుల హాలిడే టూర్ పై గోవాకు వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తృటిలో ఘోర పరాభవాన్ని తప్పించుకున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more