Ysrcp to move no confidence motion against speaker

YSRCP to move no confidence motion against Speaker, YSRCP no confidence motion against kodela shiva prasad, Assembly Secretary Satyanarayana., YSRCP decides not to attend assembly budget sessions, YSRCP decides not to attend assembly sessions, ysrcp attend assembly only on no confidence motion, partisan attitude of the presiding officer,

YSRCP says that they will not attend the house in this session except for voting on no-confidence motion and complains to Governor about the speaker’s actions

ఇక రాబోము అసెంబ్లీకి.. అవిశ్వాసంపై ఓటుకు తప్ప..

Posted: 03/19/2015 09:16 PM IST
Ysrcp to move no confidence motion against speaker

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు రవికుమార్, సురేష్, పుష్ప శ్రీవాణి తదితరులు అసెంబ్లీ కార్యదర్శి సత్యానారాయణకు ఈ నోటీసులు అందించారు. నోటీసుపై పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చించేందుకు మళ్లీ పిలిస్తే తప్ప తాను అసెంబ్లీకి కూడా వెళ్లేది లేదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానంపై పిలిచిననాడే అసెంబ్లీకి వెళ్తామని స్పష్టం చేశారు.
 
బడ్జెట్‌పై చర్చకు ఒకరోజు సమయమే కేటాయించారని, తనకు గంట మాత్రమే మాట్లాడేందుకు అనుమతినిచ్చారన్నారు. బడ్జెట్‌పై చర్చ జరిగితే మొహం చెల్లదని ప్రభుత్వం భయపడుతోందని జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వినే ఓపిక లేకపోవడం బాధాకరమన్నారు. సమస్యలపై ఎప్పుడు మాట్లాడినా అడ్డుతగులుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీపై మాట్లాడుతుండగా మైక్‌ కట్‌ చేశారన్న జగన్‌ తాము ఏం మాట్లాడాలో స్పీకర్‌ చెప్పడమేంటి అని ప్రశ్నించారు. స్పీకరే స్వయంగా మైక్‌ కట్‌ చేయడం దారుణమన్నారు. సభను దారుణంగా నడుపుతున్నారని జగన్‌ విమర్శించారు. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయని నిలదీశారు.
 
ప్రజలు నిలదీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జగన్‌ అన్నారు. శుక్రవారం సభకు హాజరుకావడం లేదని చెప్పిన జగన్‌ బడ్జెట్‌లో తాను మాట్లాడాలనుకున్న విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించనున్నట్లు చెప్పారు. అలాగే తాను శివశివానీ హై స్కూల్లో చదవలేదని, బేగంపేట పబ్లిక్‌స్కూల్లో చదివానని దీనిపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని జగన్‌ సూచించారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  no confidence motion  Speaker  

Other Articles