ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని గవర్నర్ నరసింహన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఏపిలొ చాలా ఇబ్బందులు ఉన్నాయని, కేంద్రం రాష్ట్రానికి సహాయం చెయ్యాల్సి ఉందని వెల్లడించారు. అయితే కేంద్ర నుండి అనుకున్నంత సహాయం అందడం లేదని తెలిపారు.మిగిలిన రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సాయం తప్పనిసరి అని ఆయన అన్నారు. 2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే తమ లక్ష్యమన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయటం తమ విభజన వల్ల జరిగిన నష్టాలను గత అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించామన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఉండాలన్నారు. జన్మభూమి, మా ఊరు కార్యక్రమాల ద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
గవర్నర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
*2029 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను నెంబర్వన్గా చేయటమే లక్ష్యం
*నిధుల విషయంలో కేంద్రం నుంచి అనుకూలగా స్పందచవలసి ఉంది.
* బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడాలంటే కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి
* ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ అభివృద్ధి, ఎజెండాతో ముందుకు సాగుతున్నాం.
* ఎన్ని ఇబ్బందులు ఉన్నా 2018నాటికి పోలవరం పూర్తి
* 14వ ఆర్థిక సంఘ సిఫార్సులో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వలేదు
* కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించినంత మేలు జరగలేదు
* హుద్హుద్ సహాయంగా ప్రధాని ప్రకటించిన రూ.1000 కోట్లలో రూ.650 కోట్లు విడుదలయ్యాయి.
* ప్రణాళికేతర రెవిన్యూ లోటు భర్తీ కోసం రూ.500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది
* ఏడు వెనుకబడిన జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ.350 కోట్లు కేంద్ర నుండి వస్తున్నాయి.
* విజన్-2050 డాక్యుమెంట్లు రూపొందిస్తుంది.
* స్మార్ట్ ఏపీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు పేరుతో కొత్త అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది
* అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
*2015-16 లోగా నాలుగు ఓడరేవులు అఢివృద్ది చేస్తాం.
* రాష్ట్రాన్ని ఆక్వా కేపిటల్గా మార్చుతాం
* వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
*అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం
* ఆదివాసీల కోసం గిరిపుత్రిక కల్యాణ పథకం
*రాష్ట్రంలో 93 శాతం రైతులు అప్పుల్లో ఉన్నారు.
*నదుల అనుసంధానానికి ప్రాధాన్యత
* కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై కట్టుబడి ఉన్నాం.
* రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదలు
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more