పురుషాధిక్య సమాజంలో ఇప్పుడిప్పుడే మహిళల స్వేఛ్చగా తిరుగుతున్నారు. పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అయితే అప్పడప్పుడు కొదరు చేస్తున్న వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని, ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ముసుగులు ధరించవద్దంటూ ఆ మధ్య వరంగల్ పోలీస్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రంలో కలకలాన్నే రేపాయి. అమ్మాయాల స్వేఛ్చపై ఇలాంటి పరిమితులు పెట్టడానికి మీరెవరంటూ మహిళా సంఘాలు మండిపడ్డాయి. అయితే తాజాగా మధ్యప్రదేశ్ సత్నా మేయర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆడవారికి ఆడవారే శత్రువులు అన్నట్లుగా మమతా పాండే సాటి మహిళలపై ఇలా ఆంక్షలు విధించడం నిజంగా విశేషమే.
అమ్మాయిలు స్కార్ఫ్ కట్టుకుని బయట కనపడితే పోలీసులకు అప్పగిస్తామంటూ సాత్నా మేయర్ మమతా పాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటి ఆగకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లే అమ్మాయిలెవరైనా ముఖంపై ముసుగుతో కనపడితే సాత్నా మున్సిపల్ కార్పొరేషన్, వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె అనడం గమనార్హం. హిందు సంప్రదాయం ప్రకారం మహిళలు తలపై కొంగు, ముస్లిం సంప్రదాయమైతే బురఖా ధరించడం, ఇతర మతాలకు చెందిన స్త్రీలు తమ తల భాగాన్ని ఏదైనా బట్టతో కప్పుకోవడం లాంటివి చేస్తారు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదని, సంప్రదాయాలను మరిచి దొంగల తరహాలో ముఖాన్ని ముసుగుతో కప్పి ఉంచుతున్నారంటూ మేయర్ మాట్లాడటం వివాదానికి దారి తీసింది.
ఈ మధ్య జరుగుతున్న దొంగతనాల్లో చాలా వరకు ముసుగు ధరించిన వారే, దొంగతనాలకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని సాత్నా మేయర్ అన్నారు. అంతగా ఎండ, కాలుష్యం ఉంటే గుడ్డలు చిన్నగా కట్టుకోవాలని, ఎండ ఉంటే గొడుగు తెచ్చుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. మొత్తానికి మహిళా లోకానికి పురుషులు మాత్రమే అడ్డంకి కాదు తోటి మహిళలు కూడా అందులో పాలు పంచుకుంటున్నారా? అన్నట్లు సాత్నా మేయర్ వ్యాఖ్యలు ఉన్నాయి.
-అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more