డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కీలకపాత్ర పోషించిన వివాదాస్పద చిత్రం 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్'కి సెన్సార్ బోర్డు ట్రిబ్యూనల్ సర్టిఫికేషన్ జారీ చేయడంతో సెన్నార్ బోర్డు చైర్ పర్సెన్ లీలా సామ్ సన్ రాజీనామాకు దారి తీసింది. గతంలో ఈ సినిమాకు సర్టిఫికేట్ జారీ చేసేందుకు బోర్డు నిరాకరించడంతో.. చిత్ర యూనిట్, సినిమా ధ్రువీకరణ అప్పీళ్ల ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. దీంతో మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ట్రిబ్యూనల్ క్లియరెన్స్ జారీ చేసింది. ఈ చిత్రానికి క్లియరెన్స్ జారీ చేసిన నేపథ్యంలో లీలా శాంసన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి తెలిపినట్లు ఆమె చెప్పారు.
సినిమాల సర్టిఫికేషన్ విషయాల్లో మంత్రుల జోక్యం చేసుకోవడం నచ్చని కారణంగా లీలా శాంసన్ తన పదవికి రాజీనామా చేశారు. 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్' శుక్రవారం రోజు విడుదల కావాల్సి ఉంది. కాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. బోర్డు విషయాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా మారిందని లీలా అన్నారు. మంత్రిత్వశాఖ నియమించిన ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి, జోక్యం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. గత తొమ్మిది నెలలుగా ఒక్క సారి కూడా బోర్డు సమావేశం కాలేదని, ఇందుకు తమ వద్ద నిధులు లేవని మంత్రిత్వశాఖ సమావేశాలకు అనుమతివ్వలేదని లీలా చెప్పారు.
తన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా సెన్సార్ బోర్డులో ఇప్పటికే చైర్ పర్సెన్ సహా సభ్యులందరి కాలపరిమితి ముగిసిందని చెప్పారు. అయినా తాత్కాలిక పొడగింపుల నేపథ్యంలో సభ్యులు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. కోత్త చైర్మన్ సభ్యులను నియమించడంలో ప్రస్తుత ప్రభుత్వ విఫలమైందని చెప్పారు.
అయితే సెన్సార్ బోర్డులో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అన్నారు. లీలా శాంసన్ రాజీనామా అమె వ్యక్తిగత విషయమన్నారు. అయితే సెన్సార్ బోర్డులో ప్రభుత్వ ప్రమేయం వుందని అరోపణలు చేస్తున్న లీలా శాంసన్ తన ఆరోపణలను రుజువు చేయాలన్నారు. అయితే రాధోడ్ ఒక్క విషయాన్ని మాత్రం అంగీకరించారు. సెన్సార్ బోర్డు సభ్యుల సహా చైర్మన్ కూడా గత ప్రభుత్వం నియమించిన వారేనని చెప్పారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more