బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మరో బాంబు పేల్చారు. సునందా పుష్కర్ను చంపిందెవరో ఆమె భర్త, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్కు తెలుసని.. ఆయన నోరు విప్పాలని అన్నారు. సునందా పుష్కర్ను శశిథరూర్ చంపారని తాను ఏనాడూ చెప్పలేదని స్వామి గుర్తు చేశారు. ఒక జాతీయ మీడియా లైవ్ షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఐపీఎల్ సహా అనేక విషయాలను థరూర్ మరుగుపరుస్తున్నారని ఆరోపించారు. థరూర్ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తే మొత్తం విషయాలన్నీ వెలుగులోకి వస్తాయని సుబ్రమణ్యం స్వామి చెప్పారు.
అయితే అదే షోలో లైవ్ లోకి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్.. మాట్లాడుతూ.. సునంద ఫుష్కర్ హత్యకేసులో హంతకుడికి వివరాలను సుబ్రహ్మణ్య స్వామి పోలీసులకు అందించాలని చెప్పారు. కనీసం హంతకుడు ఎలా వుంటాడన్న వివరాలనైనా అందించాలని విరుచుకుపడ్డారు. తన భార్య హత్య గావించబడిందని, అందులోనూ విషపూరితమైన ఇంజక్షన్ ఇవ్వడంతో మరణించిందని తాము బాధలో వుంటే సుబ్రహ్మణ్య స్వామి అరోఫణలకు అది అంతూ అంటూ లేకుండా పోతున్నాయన్నారు.
సునంద పుష్కర్ అంతర అవయవాల నమూనాలను పరీక్షల నిమిత్తం ఏ దేశం పంపాలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రెండు రోజుల్లో నిర్ణయిస్తుందని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సునందది అసహజ మరణమని ఎయిమ్స్ ఆస్పత్రి ఇచ్చిన నివేదిక ఆధారంగా జనవరి 1న ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యకేసుగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ కోసం సిట్ను ఏర్పాటుచేశారు.
ఈ కేసులో ప్రాథమిక విచారణ నివేదిక(ఎఫ్ఐఆర్)ను నమోదు చేసేందుకు సునంద అంతర అవయవాల నమూనాలను ల్యాబ్లో పరీక్షల నిమిత్తం అమెరికా లేదా ఇంగ్లండ్కు పంపుతామని జనవరి 6న బస్సీ చెప్పారు. అప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేమన్నారు. శశి థరూర్ను ఎప్పుడు విచారించాలో సిట్ నిర్ణయిస్తుందని బస్సీ స్పష్టంచేశారు. ఈ కేసు విషయమై మీడియాలో వస్తున్న వార్తల్లో నిజానిజాలేమిటో త్వర లోనే తెలుస్తాయని ఆయన అన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more