తెలంగాణ ప్రజలకు ఓ వరాన్ని అందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తన ప్రభుత్వ హయాంలో చేపట్టే ఏ పనికైనా ప్రభుత్వ అధికారులు లంచాలని డిమాండ్ చేస్తే తనకు పిర్యాదు చేయాలని కోరారు. అయితే ఇక్కడే తెలంగాణ ప్రజలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించిన నెంబరు తమ పిర్యాదులను స్వీకరించడం లేదు. ముఖ్యమంత్రి ప్రకటించిన నెంబరు ఆరోగ్య శ్రీకి చెందినగా తెలింది. అయితే ఇక్కడ గమ్మతైన మరో విషయమేమిటంటే.. సదరు నెంబరు తెలంగాణ ప్రభుత్వానికే కాదు.. ఆంధ్రప్రధేశ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినది కూడా.
ఈ నెంబరుకు కాల్ చేయగానే ఆంధ్రప్రదేశ్ కోసం అయితే 1, తెలంగాణ కోసం అయితే 2 కాల్ చేయండి అని అటోమేటడ్ సిస్టమ్ ప్రశ్నిస్తుంది. అయితే ఆరోగ్య శ్రీ సత్సంబంధమబైన ఐదు అంశాలకు సంబంధించిన పిర్యాదులకు ఇది స్వీకరిస్తుంది. అంతేకాని అవినీతిపై ఎలాంట పిర్యాదులను ఈ నెంబరు స్వీకరించడం లేదు. దీంతో అవినీతిపై ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన నెంబరు సంబంధించిన అంశంలో పనిచేయడం లేదని ప్రజలు అంటున్నారు. ఇకనైనా నెంబరును సరిగా జారీ చేయాలని ప్రజలకు కోరుతున్నారు. ప్రభుత్వ పనులలో లంచావతారాల పని పట్టేందుకు ప్రభుత్వం సుముఖంగా వున్నా.. తదనుగూణంగా వ్యవస్థను కూడా నిర్మించాల్సిన అవసముందని, ప్రజలు కోరుతున్నారు.
గత నాలుగు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మేలు చేయాలని ప్రవేశ పెట్టిన పథకాలలో లబ్దిదారులను ఇబ్బందులను పెట్టే అధికారులతో పాటు లంచాలను తీసుకునే అధికారులపై నేరుగా తనకే ఫోన్ చేయాలని వరంగల్ మురికివాడల్లోని ప్రజలకు చెప్పారు. లంచాలపై ఫిర్యాదుల కోసం తన కార్యాలయంలో 040-23454071 అనే టోల్ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేసిన పక్షంలో తనకు ఫోన్ చేయాలని ప్రజలను కోరిన విషయం తెలిసిందే
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more