సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్లోని కంటెంట్ను అత్యధికంగా నియంత్రిస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలించింది. భారత ప్రభుత్వ, ఇతర ఏజెన్సీల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ప్రథమార్ధంలో దాదాపు 5,000 అంశాలకు సంబంధించిన సమాచారంపై ఫేస్బుక్ ఆంక్షలు విధించింది. దీంతో ఫేస్ బుక్ లోని దాదాపు 5 వేల అంశాలను ఇతరులు చూడడానికి వీలు లేకుండా ఆంక్షలు విధించింది. ఇది ఇతర దేశాలకంటే అధికం. సోషల్ మీడియాలో విద్వేషపూరిత కంటెంట్ను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం, భద్రతా ఏజెన్సీల ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఫేస్బుక్ ఒక నివేదికలో పేర్కొంది.
వంద మిలియన్ల ఖాతాదారులున్న ఫేస్బుక్కు యూఎస్ తర్వాత భారతదేశమే ఎక్కువ మంది ఖాతాదారులున్న దేశం. దీనిని ఆసరాగా చేసుకుని అరాచక శక్తులు కుట్రలు పన్నకుండా ఫేస్ బుక్ లో వచ్చే అంశాలను ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం నియంత్రిస్తూ వస్తుంది. సామాజిక వైబ్ సైట్ లను ఆధారంగా చేసుకుని తొలినాళ్లలో జరిగిన విష ప్రచారాలను దృష్టిలో పెట్టుకని భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెబ్సైట్ లలో తప్పుడు ప్రచారాలను నియంత్రించాలని ఫేస్ బుక్ ను కోరుతూనే వస్తుంది. మతాలు, ప్రభుత్వాలను విమర్శించే విధమైన కంటెంట్పై భారత చట్టాల ప్రకారం నిషేధం ఉన్నట్లు వివరించింది. దరిమిలా.. ఎలాంటి సంఘవ్యతిరేక కార్యక్రమాలకు, విధ్వంస రచనలకు ఆస్కారం వుండకుండా చర్యలు తీసుకంటూ వస్తోంది.
ఇక అత్యధికంగా ఆంక్షల విజ్ఞప్తులు చేసిన భారత్ తరువాతి దేశాల్లో టర్కీ (1,893), పాకిస్థాన్ (1,773) ఉన్నాయి. మరోవైపు, అత్యధిక సంఖ్యలో యూజర్లు, వారి అకౌంట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ కోరిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలోనూ, భారత్ రెండో స్థానంలో ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి జనవరి-జూన్ 2014 మధ్య కాలంలో 5,958 మంది యూజర్లు, వారి అకౌంట్ల వివరాలు ఇవ్వాలంటూ 4,559 విజ్ఞప్తులు వచ్చినట్లు ఫేస్బుక్ తన నివేదికలో వెల్లడించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more