పాక్ నియంతగా పేరొందిన కార్గిల్ యుద్ధ కారకుడు ముషార్రఫ్ మరోసారి భారత్ పై విషం చిమ్మారు. ఉపఖండంపై తనకు ఉన్న పగ, కసిని మరోసారి మీడియాతో వెల్లడించారు. కాశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఏదో ఒక అంశంతో రెచ్చగొడుతూనే ఉండాలన్నారు. కాశ్మీర్లో వివాదాలు జరగటమే పాక్ కు లాభం కల్గిస్తుందని చెప్పారు. భారత్, పాక్, కాశ్మీర్ అంశాలపై ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా ఇంటర్య్వూలో మాట్లాడిన ముషార్రప్ ఈ కామెంట్లు చేశాడు.
అంతేకాకుండా కాశ్మీర్ లో పోరాటాలు చేసేవారికి పాక్ ఎఫ్పుడూ సహాయ సహకారాలు అందించాలన్నారు. కాశ్మీర్ లో పోరాటాలు చేసే యువతతో పాక్ సైన్యం కలిస్తే.., భారత్ ను ఎదుర్కోవటం చాలా సులభం అవుతుందన్నారు. తద్వారా పాక్ ఎఫ్పుడూ భారత్ పై దాడి చేసేందుకే ఎదురుచూస్తుంది అని పరోక్షంగా స్పష్టం చేశాడు. పాక్ చావుదెబ్బతిన్న కార్గిల్ యద్ధానికి కారకుడైన ముషార్రఫ్ పదవిని వీడినా ఉపఖండంపై తన శత్రుత్వంను మాత్రం మానుకోలేదు. గతంలో కూడా కార్గిల్ యుద్దం, కాశ్మీర్ అంశాలపై పలుమార్లు విషం కక్కారు.
ఇక ప్రధాని నరేంద్రమోడిపై కూడా పాక్ మాజి సైనికాధ్యక్షుడు విమర్శలు చేశారు. మోడి ఓ మతవాది అని విమర్శించారు. భారత ప్రధాని ఒక మతానికి అనుకూలంగా వ్యవరిస్తారు అని ఆరోపించారు. భారత్ తో శాంతిని కోరుకుంటున్నామని చెప్తున్న పాక్ సరిహద్దులో మాత్రం రోజూ దొంగదెబ్బతీసేందుకు కాచుకుని కూర్చుంటున్న విషయం తెలిసిందే. తాజాగా మాజి అధ్యక్షుడి కామెంట్లతో మరోసారి రెండు దేశాల మద్య మాటల యుద్ధానికి తెరలేచింది. ముషార్రఫ్ కామెంట్లపై పాక్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more