బంగాళాఖాతంలో ఏర్పడిన 'హుదూద్' పెను తుపాను ప్రభావంతో ఒడిశాలోని బరంపురం పట్టణవాసులు భయం గుప్పిట్లోకి జారుకున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇవాళ మరింత జోరందుకున్నాయి. భారీ వర్షాలకు పెనుగాలులు తోడవడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. వర్షాలకు తోడు వేగంగా వీస్తున్న పెనుగాలులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బరంపురం క్రీడామైదానం ప్రహరీని ఆనుకుని ఉన్న చెట్టు కొమ్మ పెనుగాలులకు విరిగి రోడ్డుపైకి కూలింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమవ్వడంతో నగరంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహన రాకపోకలు నిలిచిపోవడంతో 16, 59వ నంబరు జాతీయ రహదారులు బోసిపోయాయి. ఫైలిన్, నీలం తుపాన్లు మిగిల్చిన గాయాలను మరువక ముందే మరో పెను తుపాన్ తమ బతుకులను చిద్ధ్రం చేస్తుందని వణుకుతున్నారు. కడలి తల్లి తమప పగబట్టినట్లుగా వుందని, అందుకనే వరుస తుపాన్లు తమను నిండా ముంచుతున్నాయని వారు వాపోతున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతమైన బరంపురంలోని వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మురికివాడల వాసులు ఆశ్రయం పొందుతున్నారు. ఆయా కేంద్రాల్లో విద్యుత్తు, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
దక్షిణ ఒడిశా ముఖద్వారం బరంపురం రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు సుమారు పది వేల మంది సాధారణ ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. రిజర్వేషన్ టికెట్ ప్రయాణికులు అదనం. కాగా 'హుదూద్' పెనుతుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దవగా, మరికొన్నింటిని దారి మళ్లించడంతో ఇవాళ బరంపురం రైల్వే స్టేషన్ బోసిపోయింది. రైల్వే స్టేషన్లోని నియంత్రణ గదిలో ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రత్యేక అధికారుల బృందం 24 గంటలూ పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు, రిజర్వేషన్ రద్దు, ఇతరత్రా వివరాలు ఫోన్ల ద్వారా అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెనుతుపాను కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటే దాన్ని ఎదుర్కొనేందుకు నియంత్రణ గదిలో ఓ శాటిలైట్ ఫోను కూడా సిద్ధంగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు బస్సు రవాణా వ్యవస్థను కూడా అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు రద్దు సమాచారంతో వెనుదిరిగారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more