ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని వైఎస్ఆర్ సిపి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సలహా ఇచ్చారు. రుణ మాఫీ అంశంపై రోజుకో మాట చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి సహేతుకం కాదన్నారు. రైతుల చేతిలో బాండ్లు పెట్టి, వారి చెవిలో పూలు పెట్టినవిధంగా రుణమాఫీ ఉందని విమర్శించారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు. రైతులను ఎందుకు అయోమయానికి గురి చేస్తున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీలు గుప్పించడంతోనే ప్రజలు ఆయన పార్టీ వైపు మొగ్గు చూపారని, అధికారంలోకి వచ్చిన తరువాత వారిని అయోమరంలోకి నెట్టి.. ప్రభుత్వం రోజుకో నాటకానికి తెరలేపుతుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ లో గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలకు విరుద్ధంగా పాలన కొనసాగుతోందన్నారు. గాంధీ జయంతి రోజున స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అసత్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు. బెల్టు దుకాణాలను లేకుండా చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అంచెల వారీగా పూర్తిగా మద్య నిషేదం విధిస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత మధ్య నిషేధానికి బదులు.. డోర్ డెలివరీ సౌకర్యాన్ని తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు పనితీరుపై శ్వేతపత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. తాను ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారో కేలండర్ విడుదల చేయాలని ఉమారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కమిటీలు, చర్చల పేరుతో కాలయాపన చేయవద్దని కోరారు. జన్మభూమి కార్యక్రమాలలో ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారని ఉమ్మారెడ్డి హెచ్చరించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more