వైఎస్ జగన్ బిగ్ షాట్ తగిలింది! ఇప్పటికే చిన్న చిన్న షాట్ తగిలిన పెద్దగా పట్టించుకోలేదు. కానీ జగన్ ఉంటే.. పక్కనే జూపూడి ఉంటాడని తెలుసు. ఒకనోక సమయంలో.. జగన్ నీడ .. జూపూడి అని రాజకీయ నేతలు జోకులు వేసుకున్నారు. వైసీపీలో జూపూడి ప్రభాకర్ దిన.. దినం పెరుగుతుందని ఆయన అభిమానులు అనుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జగన్ అంటేనే జూపూడి..చిరాకు పడుతున్నాడు. అవసరమైతే.. కామెంట్లు చేయటానికైన సై అంటున్నారు. ఇంతకీ విషయం ఏమింటే.. జగన్ కు జూపూడి బిగ్ షాట్ రుచి చూపించాడు.
వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ ఈరోజు మీడియా ముందు .. జగన్ పార్టీలో జరిగిన నేరాలు, ఘోరాలు గురించి చెప్పటం జరిగింది. జూపూడి మాట్లాడుతూ.. తండ్రిని కోల్పోయిన తర్వాత రాజకీయాల్లో ఎవరూ తోడులేని వ్యక్తిగా మిగిలిపోయిన వైయస్ జగన్ కు అండగా ఉండాలనే వైకాపాలో చేరానని జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ లు తనకు తోడుగా ఉంటామని చెప్పినా... రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతోనే జగన్ వెంట నడిచానని తెలిపారు.
వైయస్ మరణం సహజం కాదని... కుట్ర అని మొదట చెప్పిన వ్యక్తిని తానే అని చెప్పారు. కానీ, ఆ తర్వాత వైకాపాలో తనకు ఎన్నో అవమానాలు జరిగాయిని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ను అరెస్ట్ చేసిన రోజున వైయస్ కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీద నిరసన కార్యక్రమం చేపట్టారని... ఆ రోజున వారి కుటుంబ సభ్యులతో పాటు తాను, సబ్బం హరి మాత్రమే ఉన్నామని వెల్లడించారు.
దీనికి సంబంధించి అందరిపై కేసు నమోదయిందని... ఆరుగురు వ్యక్తుల (విజయమ్మ, భారతి, షర్మిల, భారతి తండ్రి, తాను, బ్రదర్ అనిల్)కు సమన్లు తీసుకుని వచ్చిన కానిస్టేబుల్ తో జూపూడి ఎవరో తమకు తెలియదని వైయస్ భారతి తండ్రి సుబ్బారెడ్డి చెప్పారని తెలిపారు. ఈ విషయం చెబుతున్నప్పుడు జూపూడి స్వరం బొంగురుపోయింది. తానెవరో తెలియదనడం తననెంతో బాధించిందని అన్నారు. ఆ తర్వాత వారందరూ కలసి ఓ లాయర్ ను పెట్టుకున్నారని... తాను విడిగా మరో లాయర్ ను పెట్టుకున్నానని వెల్లడించారు.
జగన్ పార్టీలోని నేతలకు విలువ లేదు:
వైకాపాలో వైయస్ బంధువులకు తప్ప మరో నేతకు విలువ లేదని ఆ పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మనసు చంపుకుని ఇంతకాలం కొనసాగానని, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేశానని చెప్పారు. ఇకపై వైకాపాలో కొనసాగలేనని... పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు.
వైఎస్సార్సీపీ నేతల మధ్య అభద్రతా భావం నెలకొందని జూపూడి తెలిపారు. ఏ ఇద్దరు నేతలూ మాట్లాడుకునే పరిస్థితి పార్టీలో లేదని చెప్పారు. నేతలను గౌరవించే సంప్రదాయం వైకాపాలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అభద్రతా భావం కలిగిన నేతలతో కూడిన పార్టీ ఎంతో కాలం మనలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
జిల్లాలను జగన్ కుటుంబ సభ్యులు
తన రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఫ్యాక్స్ ద్వారా పంపించానని జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. వైకాపాలో నేతల మధ్య సఖ్యత లేదని అన్నారు. ఇప్పటికీ కీలక నేతలైన బాలినేని, వైవీ మాట్లాడుకోరని వెల్లడించారు. వైయస్సార్ పార్టీ రాజరిక పాలనను తలపిస్తోందని... సామంత రాజులకు అప్పగించినట్టు కుటుంబసభ్యులకు జిల్లాలను అప్పగించారని ఎద్దేవా చేశారు. జగన్ కోసం, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశానని... అయినా తనను దూరంగా ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే జగన్ పార్టీ నుండి.. జూపూడి పై ఎలా దాడి చేస్తారో.. రేపటి న్యూస్ లో చూద్దాం.!! ఆ పార్టీ కొత్తపల్లి గీతపై.. ఫేస్ బుక్ దాడి, మరీ జూపూడి పై...????????
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more