ఇక దేశంలో అమ్మ కార్డులు పోయి.. అయ్య కార్డులు వస్తున్నాయి.యూపిఏ ప్రభుత్వం లో దేశం ప్రజలకు తప్పని సరిగా ఆధార్ కార్డు ఉండాలని అందరికి ఆధారం ఈ ఆధార్ కార్డే అని చెప్పింది. కానీ సోనియా గాంధీకి అధికారం అందలేదు. కానీ అందరికి ఆధార్ కార్డు దక్కింది. అయితే ఇప్పుడు యన్డీఏ సర్కార్ కన్ను సోనియా గాంధీ ఇచ్చిన ఆధార్ కార్డు పై పడింది. ఆమె ఇచ్చిన ఆధార్ కార్డు బాగలేదు.. మేము కొత్త రకం ఆధార్ కార్డు ఇస్తామని మోఢీ సర్కర్ చెబుతుంది.
కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రదిపాదనలు సిద్ధం చేయాలంటూ ఉన్నతాధికారులను హోంశాఖ ఆదేశించింది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్పై ఉన్నతాధికారులతో చర్చించిన హోంశాఖా మంత్రి రాజ్నాధ్ సింగ్ జాతీయ గుర్తింపు కార్డుల జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్టు సమాచారం.
అయితే పౌరులకు జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం అందరిని ఆశ్యర్యపరుస్తోంది. ఇప్పటికే యూపీఏ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆధార్ ప్రాజెక్టు ఉంది. సుమారు 54 కోట్ల మంది ఆధార్ కార్డులు అందుకున్నారు. సంక్షేమ పథకాలకు కూడా ఆధార్ కు జతచేశారు. దీనిని కొనసాగిస్తామని ఇటీవల ఎన్డీయే సర్కార్ ప్రకటించింది. మళ్లీ కొత్తగా జాతీయ గుర్తింపు కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని హోంశాఖా మంత్రి ఆదేశించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న ఈ నిర్ణయంతో ఆధార్ ప్రాజెక్టుకు బ్రేక్ వేస్తారా..? లేక ఆధార్ అలాగే కొనసాగించి మరో ప్రాజెక్టు చేపడతారా? అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అయినా ప్రభుత్వం మారిన సారీ దేశ ప్రజలకు ఇలాంటి కష్టాలు సహజంగా ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే వారు తమ పార్టీ హవాను పెంచుకోవటానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ‘‘మోడీ ఆధార్ తో ఎలాంటి ప్రయోజానాలు ఉంటాయో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more