2014 లో దేశంలో అధికారాన్ని చేజిక్కించుకోదలచుకున్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, మోదీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ ఆకట్టుకునే ప్రసంగాలు చేసిన తర్వాత నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ని పక్కకు నెట్టేసి విజయం సాధించిన తర్వాత భాజపాకి అధికారం సంపాదిస్తామనే ధైర్యం, కాంగ్రెస్ కి అధికారం పోతున్నదనే అధైర్యం మొదలయ్యాయి. దానితో రెండు పార్టీలూ శక్తివంచన లేకుండా కృషి చేసి సాధించాలనే ఉద్దేశ్యంతో దక్షిణ భారత దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ వైపు దృష్టి సారించాయి.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఏమీ తేల్చకుండా తాత్సారం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ సింగ్ తెలంగాణా కు మద్దతు తెల్పుతూ సంచరించటం మొదలు పెట్టారు, పార్టీ పెద్దలను కూడా తీసుకునివచ్చి వారి చేత కూడా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి కృషిచేస్తామని చెప్పించారు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టనట్లయితే బేషరతుగా మద్దతునిస్తామని చెప్పారు. అప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చలనం లేకపోయేటప్పటికి, వచ్చే ఎన్నికలలో అధికారం మాదే కాబట్టి అంతకు ముందు మా అధికారంలో చేసినట్లుగానే రాష్ట్రాన్ని విభజిస్తామని, 100 రోజుల్లో ఆ పని పూర్తిచేసి చూపిస్తామని అనటం మొదలుపెట్టారు. ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రాబల్యం తక్కువైపోతున్నట్లుగా కనిపించటంతోనూ, దానితోపాటు తెలంగాణా ఉద్యమ పార్టీయైన తెలంగాణా రాష్ట్ర సమితి తమకు పదవులు అవసరం లేదని, తెలంగాణా వస్తే చాలని, తెలంగాణా ఇచ్చిన పక్షంలో కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పటంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు వడివడిగా అడుగులేస్తూ రాష్ట్రంలో సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను కానీ, పార్టీలో అంతర్గతంగా చెలరేగుతున్న వ్యతిరేకతలను కానీ పట్టించుకోకుండా చివరి దశలో భాజపా నాయకులను విందుకు పిలిచి వారి మద్దతుని కోరుతూ, ఎట్టకేలకు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి పార్లమెంటు నుంచి ఆమోదాన్ని సాధించింది.
కానీ ఈ విషయంలో సీమాంధ్ర మద్దతును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఆశించిన విలీనం కాని మద్దతుకానీ తెరాస నుంచి రాకపోవటంతో నిరాశకు లోనైంది. దానితో కాంగ్రెస్ కి ఇరు ప్రాంతాలలోనూ గెలుపు హుళక్కే అన్న భావన కలుగుతోంది. ఇక దానితో తెలంగాణాలో పోటీ ప్రధానంగా భాజపా తెరాసల మధ్య ఏర్పడింది. ఉద్యమం ద్వారా తెలంగాణాను సాధించామని తెరాస అంటోంది కానీ కాంగ్రెస్ కి కానీ భాజపా కి కానీ అప్పట్లో కృతజ్ఞతలు తెలిపినా, ఇప్పుడు మాత్రం ఆ రెండు పార్టీలను నమ్మవద్దని చెప్తోంది.
అయినా మోదీ ప్రభావం, తెలంగాణాకు మద్దతిచ్చిన ప్రభావం వలన శాసన సభకు తెరాసను, లోక్ సభకు భాజపాను గెలిపిద్దామన్న ప్రజల నాడి కనపడుతోంది. ఇక తెలంగాణాలో తెలుగు దేశం పరిస్థితి కూడా కాంగ్రెస్ లాగానేవుంది కానీ ఎంత మాత్రం మెరుగ్గా కనపడటం లేదు. హైద్రాబాద్ అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకి అక్కడ పెద్దగా ఉపకరించటం లేదు. అయితే అదే అంశం సీమాంధ్రలో మాత్రం ఉపయోగపడుతోంది. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న తెదేపా మాటలను సీమాంధ్రలో నమ్మేవారి సంఖ్య ఎక్కువగానే కనపడుతోంది. కానీ భాజపా సీమాంధ్రలో అంతకు ముందూ ఏమీ లేదు కానీ మోదీ ప్రభావం కూడా పడకుండా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు వలన భాజపాకు మద్దతు ఆట్టే లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో భాజపా తెలంగాణా లోనూ, సీమాంద్ర లోనూ పార్లమెంట్ సీట్లను దక్కించుకోవటం కోసం తెలుగు దేశం పార్టీతో జత కట్టటానికి సిద్ధమైంది. తెదేపాకు ఎక్కువ ప్రాబల్యం లేని తెలంగాణా ప్రాంతంలోను, భాజపాకు ఎక్కువ ప్రాబల్యం లేని సీమాంధ్రలోను గెలుచుకోవటానికి ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఉభయులకూ శ్రేయస్కరమన్న అభిప్రాయానికి వచ్చారు.
దీనికి తోడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన, అంతకు ముందు నుంచే ఉన్న లోక్ సత్తా పార్టీలు కూడా భాజపా కి మద్దతు పలకటంతో భాజపాకి ఊపిరి పీల్చుకున్నట్లయింది. కాకపోతే సీట్ల ఎడ్జెస్ట్ మెంట్ల దగ్గరే ఇంకా అవగాహన రాలేదని తెలుస్తోంది. సీట్లు అడగటానికి కూడా ఒక పద్ధతి ఉండాలని, గతంలో 45 సీట్లలో 10 సీట్లను మాత్రమే గెలుచుకున్న భాజపా ఈ సారి ఏం సాధించిందని ఎక్కువ సీట్లు అడగటం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ బలహీన పడితే తానూ బలహీన పడతానని, దానితో తెలుగు ప్రజలు కూడా బలహీనపడతారంటూ చంద్రబాబు భాజపా సీట్లు అడిగే విధానం న్యాయబద్ధంగా ఉండాలన్నారు.
ఇక, రాష్ట్రం భాజపాకి ఎన్ని సీట్లను ఇస్తుంది, దానిలో ఎన్ని చోట్ల భాజపా గెలుపొందుతుంది, మద్దతునిస్తానంటున్న పార్టీలు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, అందులో ఎన్ని చోట్ల గెలుపొందుతారు అన్న వాట్ల మీద రాష్ట్రం భాజపాకి నిజంగా ఏమిస్తుందన్నది ఆధారపడుతుంది. ఎందుకంటే, తెలంగాణా ప్రాంతంలో తెరాస, సీమాంధ్రలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా బలంగా బరిలో దిగుతున్నాయి కాబట్టి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా జై సమైక్యాంధ్రా పార్టీ ని నెలకొల్పారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి తాను కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకినని సుస్ఫష్టంగా తెలియజేస్తూ తన మద్దతును భాజపాకు ఇస్తానంటూ తెలియజేయటం, లోక్ సత్తా పార్టీ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడుతూ భాజపాకు మద్దతునిస్తాననటంతో భాజపాకు రాష్ట్రం నుంచి గెలుపే కాకుండా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల మద్దతుతో కూడా కేంద్రంలో అధికారం సాధించవచ్చునన్న ధైర్యం ఏర్పడుతోంది.
కాంగ్రెస్ పార్టీతోనైతే భాజపాకి రాష్ట్రంలో ఎటువంటి పోటీ లేదు. ఎందుకంటే తెలంగాణాలో తెరాస మద్దతు మీద ఆధారపడుతూ వచ్చిన తెరాస వెనక్కి తగ్గటంతో నీరసించిపోయింది. సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులలో చాలా మంది తెదేపా, వైకాపా, భాజపా, జైసమైక్యాంధ్ర పార్టీలలోకి వలసవెళ్ళిపోయారు.
ఏమైనా, భాజపా రాష్ట్రం నుంచి నిరాశ చెందదన్న సంకేతాలు మాత్రం ధృఢంగా వస్తున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more