గుజరాత్ పర్యటనలో ఉన్న ఆఆపా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయానికి నరేంద్ర మోదీని కలవటానికి పోతుండగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దానితో ఆఆపా నాయకుడు మనీష్ శిసోడియా నరేంద్ర మోదీ అప్పాయింట్ మెంట్ కోసం బయలుదేరారు.
గుజరాత్ రాష్ట్రంలో మోదీ చెప్తున్నంత ప్రగతి ఉందా అని ప్రత్యక్షంగా చూడటానికి నాలుగు రోజులుగా పర్యటన చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తను చేసిన పరిశీలనలో కలిగిన సందేహాలను 16 ప్రశ్నలుగా మోదీని అడగటానికి పోతుండగా మోదీతో భేటీకి ఆయనతో అప్పాయింట్ మెంట్ లేని కారణంగా మధ్యలోనే ఆయనను గుజరాత్ పోలీసులు అడ్డుకున్నారు.
కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా భాజపా కార్యకర్తలు ఈ రోజు ఉదయం గోబాక్ అంటూ నినాదాలు చేసారు. గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నందుకు పోలీసులు వివరణనిచ్చారు. అనుమతి లేకుండా గాంధీధామ్ లో మైక్ లను ఉపయోగిస్తూ ప్రసంగాలు చేసారని, అందుక ఎన్నికల కమిషన్ అధికారులు కూడా సాక్షులని, వారు చెప్పబట్టే కేజ్రీవాల్ ని అదుపులోకి తీసుకోవటం జరిగిందని అన్నారు.
కేజ్రీవాల్ ముఖ్యంగా అడగదలచుకున్నవి, మోదీ చెప్తున్న రాష్ట్రంలో అవినీతి అంతం, ఉపాధి పెంపు మీద ప్రజల అభిప్రాయం భిన్నంగా ఉందని అన్నారు. ప్రధానమంత్రైన పక్షంలో కెజి బేసిన్ లో గ్యాస్ ధరను తగ్గిస్తారా అని అడుగుతానని అన్నారు కేజ్రీవాల్.
అయిత మా అబివృద్ధికి కేజ్రీవాల్ ఇన్స్ పెక్టర్ అయ్యారా అంటూ భాజపా నాయకులు కేజ్రీవాల్ ని విమర్శించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more