ఆంధ్రప్రదేశ్ ని 21 ముఖ్యమంత్రులు పాలించగా అందులో నీలం సంజీవ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి రెండు రెండు సార్లు ఆ పదవిని పొందగా ఎన్ టి రామారావు మూడుసార్లు ఆ పదవిన చెపట్టారు. అందువలన ముఖ్యమంత్రులు 21 మందైనా ఆ పదవులను అలంకరించినవారు 16 మందే. వాళ్ళు వరుసగా,
1. నీలం సంజీవ రెడ్డి,
2. దామోదరం సంజీవయ్య,
3. నీలం సంజీవ రెడ్డి,
4. కాసు బ్రహ్మానంద రెడ్డి,
5. పివి నరసింహారావు,
6. జలగం వెంగళరావు,
7. మర్రి చెన్నా రెడ్డి
8. టంగుటూరి అంజయ్య,
9. భవనం వెంకటరామిరెడ్డి,
10. కోట్ల విజయ భాస్కర రెడ్డి,
11. ఎన్టీ రామారావ్
12. నాదెండ్ల భాస్కర రావు,
13. ఎన్టీ రామారావు
14. మర్రి చెన్నా రెడ్డి,
15. నేదురుమల్లి జనార్దన రెడ్డి,
16. కోట్ల విజయ భాస్కర రెడ్డి,
17. ఎన్టీ రామారావు,
18. ఎన్ చంద్రబాబు నాయుడు,
19. వై యస్ రాజశేఖర రెడ్డి,
20. కొణిజేటి రోశయ్య,
21. ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి.
పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రిగా చేసి దిగిపోయిన తర్వాత జనవరి 11 1973 నుంచి జనవరి 10 1974 వరకు సంవత్సర కాలం పాటు రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర పతి పాలన విధిస్తే ఇది ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో రెండవసారి అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3378 రోజులు చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పాలించగా, నాదెండ్ల భాస్కర రావు అతి తక్కువ కాలం 31 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
చంద్ర బాబు నాయుడు తర్వాత రెండవ స్థానంలో 2777 రోజులు అధికారంలో ఉన్న ముఖమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆ తర్వాత మూడు సార్లు అధికారంలో ఉన్న మొత్తం 2751 రోజులు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నఎన్టీ ఆర్ మూడవ స్థానాన్ని అలంకరిస్తారు.
పై ముఖ్యమంత్రులలో 9 మంది రాయల సీమ నుండి వచ్చినవారు, 5 గురు ఆంధ్రా ప్రాంతం నుండి, ఇద్దరు తెలంగాణా నుండి వచ్చినవారు. ముగ్గురు తెలుగు దేశం పార్టీ వారైతే మిగిలిన 13 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే.
నవంబర్ 1 1956 లో ప్రారంభమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తానం ఇప్పటి వరకు చూసుకుంటే 58 సంవత్సరాలలో అంటే, (5 తో భాగిస్తే) 12 టెర్మ్ లలో మొత్తం 21 మంది ముఖ్యమంత్రుల ఏలుబడిలో గడిచింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more