యుపిఏ ఛైర్ పర్సని సోనియా గాంధీ రేపు పార్లమెంట్ లో రాష్ట్ర విభజన బిల్లు మీద ప్రసంగించే అవకాశం ఉంది.
బిల్లు మీద జరుగుతున్న వివిధ విమర్శలు, ఆరోపణలు, సవరణల మీద సూచనలు, వ్యతిరేకతలు వస్తున్న నేపథ్యంలో ఇంతవరకూ తెలంగాణా బిల్లు మీద ఒక్క ముక్క కూడా మాట్లాడని సోనియో గాంధీ రేపు బిల్లు ప్రవేశపెట్టే సమయంలో మాట్లడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టటం దాన్ని చదివి వినిపించటం అవటంతో రేపు మంగళవారం తెలంగాణా బిల్లు మీద చర్చకు మార్గం సుగమం అయింది. రేపటి రోజున హోరాహోరీ పోరాటానికి ఇటు సీమాంధ్ర నాయకులు, అటు తెలంగాణా నాయకులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ నియంత్రిస్తూ బిల్లును ముందుకు తీసుకెళ్ళటానికి కేంద్ర ప్రభుత్వం తయారుగా ఉంది.
విభజన బిల్లు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తయారైంది. ఎలాగైనా సరే ఆ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉన్నట్లుగా కూడా కనిపిస్తోంది. భాజపా తాజా నిర్ణయమేమిటో బహిర్గతం చెయ్యకపోయినా కాంగ్రెస్ నమ్మకం చూస్తుంటే భాజపాతో ఒక ఒప్పందానికి వచ్చినట్లే కనిపిస్తోంది. రాష్ట్ర పునర్విభజన బిల్లు తర్వాత రాహుల్ గాంధీ మకుటంలో కలికి తురాయిలుగా ప్రకాశింపగల అవినీతి నిరోధక బిల్లులున్నాయి. వాటిని కూడా ఆమోదింపజేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు ఎక్కినట్లేనని భావిస్తోంది.
బిల్లు రేపు చర్చకు వస్తోందని స్పష్టంగా ప్రకటన చేసిన పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమలనాథ్ దానికి వ్యతిరేకంగా చెప్పదలచుకున్నవాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకించవచ్చని అన్నారు. అంటే సభలో గలాటా చెయ్యవద్దని సూచిస్తున్నారు. అంటే రేపటి సభలో అల్లరి చేస్తే క్లాసులో పిల్లలను బెంచీ ఎక్కించినట్లుగా సభలోంచి మరికొన్ని బహిష్కరణలు జరగవచ్చని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సంకేతాలు వస్తున్నాయి.
రాజ్యసభలో 20 న ఈ బిల్లు చర్చకు వస్తుందని రాజ్యసభ చైర్మన్ చెప్పారు.
విధి రాసిపెట్టినట్టు జరుగుతుందన్నట్లుగా, శాసనసభకు పంపిన బిల్లు ఎప్పుడు తిరిగి వస్తుందో, రాష్ట్రపతికి పంపిన బిల్లు ఆమోద ముద్ర వేయించుకుని ఎప్పుడు వస్తుందో, లోక్ సభలో ఎప్పుడు ఆమోద ముద్ర వేయించుకుని రాజ్య సభకు వెళ్తుందో అంతా కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరి సీమాంధ్ర నిరసనలకు, ఢిల్లీ లో చేస్తున్న ధర్నాలు, ర్యాలీలకు ఇంతవరకు కాంగ్రెస్ నాయకత్వంలో దేశాన్ని పాలిస్తున్న యుపిఏ ఎటువంటి స్పందనా చూపించలేదు. రేపు సోనియా గాందీ ప్రసంగమంటూ జరిగితే అందులో సీమాంద్ర వాసులకు ఏం హామీలు ఇవ్వబోతున్నారన్నది ఆసక్తికరంగా తయారైంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more