విశ్వాస ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టిన సిసోడియా వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి ఢిల్లీ ప్రజలకోసం కదలిరావాలని శాసనసభలో పిలుపునిచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాట్లాడుతూ మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాగ్దానాలకు కట్టుబడివుందని, నీరు విద్యత్ మాత్రమే కాకుండా ఢిల్లీలో ఇంకా ఎన్నో వసతులను మెరుగుపరుస్తామని చెప్తూ ఢిల్లీలో పాఠశాలల్లోనూ హాస్పిటల్స్ లోనూ సిఫారసులు లేకుండా చేర్చుకునే విధానాన్ని అమలుపరుస్తామని అన్నారు.
అయితే అంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ టోపీలకే తప్పు పట్టిన భాజపా విశ్వాస ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఢిల్లీ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీ పక్కదోవ పట్టిస్తున్నారంటూ భాజపా నాయకుడు హర్షవర్ధన్ శాసనసభలో అన్నారు.
ఢిల్లీ ప్రజలకు మంచి చేసే పార్టీకి అధికారమివ్వమని ఎన్నికల ముందు కోరిన విధంగా వోటర్లు భాజపా కి ఎక్కువ స్థానాలనిచ్చారని, అయినా ప్రతిపక్షానికే అంకితమై ఉండాల్సివస్తోంని హర్షవర్ధన్ అన్నారు.
ఢిల్ల ప్రజలు ఆమ్ ఆద్మీకి మద్దతునివ్వాలని కోరుకుంటున్నారు కాబట్టి ఆ పార్టీకి సమర్ధనను తెలియజేస్తున్నామని, ఢిల్లీ ప్రజల సంక్షేమంలో పనిచేస్తున్నంత కాలం ఆప్ కి తమ మద్దతుంటుందని కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి అరవిందర్ సింగ్ లవలీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దని కూడా హెచ్చరించింది.
జెడి(యు) శాసన సభ్యుడు షోయెబ్ ఇక్బాల్ చేసిన వ్యాఖ్యల మీద శాసన సభలో గందరగోళం ఏర్పడింది. ఆయన ఉపన్యాసంలో రామ్ మందిర్ ప్రస్తావన తీసుకుని రావటంతో భాజపా శాసన సభ్యులు ఆవేశానికి గురయ్యారు. దానితో ఇక్బాల్, భాజపా నాయకుల మధ్య వాగ్యుద్ధం నడిచింది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more