తెలంగాణ కోసం తెలంగాణ నేతలు, సమైక్యాంద్ర కోసం సీమాంద్ర నేతలు .. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్ద పంచాయితీ పెట్టేందుకు సిద్దమవుతున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లులో మార్పుల కోసం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీని కలవాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. మార్పులపై ఆ ప్రాంత ఎమ్మెల్యేలందరితో సంతకాలు సేకరించి రాష్ట్రపతికి సమర్పించాలని తీర్మానించినట్టు జేఏసి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. జేఏసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలను రాష్ట్రపతికి వివరించనున్నట్టు తెలిపారు. అసెంబ్లీ లో బిల్లుపై చర్చించకుండా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చించి వేయడం, స్పీకర్ను అగౌరవపరచడం వంటి విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు.
బిల్లు త్వరగా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలను కోరుతా మన్నారు. మార్పుల కోసం వారి సంతకాలను సేకరిస్తామని చెప్పారు. జిల్లా జేఏసీలు ఆయా జిల్లాలోని ఎమ్మెల్యేల నుండి సంతకాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. సంతకాలు తీసుకునే పత్రాలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధూలో ఉంటాయని తెలి పారు. బిల్లులోని అంశాలను ప్రజలకు వివరిస్తూ సభలు, సమావేశాలను నిర్వ హించనున్నట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర పాలకుల కుట్రలను ఈ సభల ద్వారా ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. జేఏసీ నేతలు దేవిప్రసాద్, శ్రీనివాస్గౌడ్, అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్కుమార్ మాట్లాడుతూ బిల్లులను చించి వేసిన వైఖరిని ఖండించాలని నిర్ణయించినట్టు తెలిపారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రజా ప్రతినిధులు ఇపుడు రాజ్యాంగాన్ని అవమానించడం సరైంది కాదన్నారు. అసెంబ్లీలో చర్చ ముగించి పార్లమెంటుకు పంపి వెంటనే బిల్లు ఆమోదం పొందేలా తెలంగాణ ప్రాంత నేతలు ప్రణాళిక రూపొందించుకోవాలని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదం పొందేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more