అదొక దొంగ కుటుంబం! ఆ ఫ్యామిలీలో తల్లి.. తండ్రి.. కొడుకు.. అందరూ చోరశిఖామణులే!! బస్టాండులు, రద్దీ ప్రదేశాలే వారి కార్యక్షేత్రాలు! ప్రయాణికుల్ని ఏమార్చి చేతివాటం ప్రదర్శించడం వారికి వెన్నతో పెట్టిన విద్య!! ఆ విద్యతో వారు సంపాదించిన ఆస్తులు రెండు కోట్లకు పైమాటే! గుంటూరుజిల్లా తాడేపల్లికి చెందిన మానుపాటి మంగమ్మ (35) అండ్ ఫ్యామిలీ చోరచరిత్ర ఇది. మంగమ్మ, ఆమె భర్త ఆదినారాయణ (40), కుమారుడు మనోహర్ (19)లు గత పదేళ్లుగా గుంటూరుజిల్లాలోనూ హైదరాబాద్లోనూ చోరీలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో 57 కేసులున్న మాయలాడి మంగమ్మ.. ఈ నెల 17న విజయవాడ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు దొరికిపోయింది.ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
చోరీల ద్వారా సేకరించిన సొమ్మునంతా ఈ ఫ్యామిలీ ఐదు బ్యాంకుల్లో భద్రపరిచినట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. కస్టడీలో ఆమెను విచారించిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మినంత పనైంది! ఆమె ఆస్తుల వివరాలు తెలిశాక దిమ్మతిరిగి మైండ్ బ్లాకయ్యింది! పదేళ్ల చోర వృత్తితో ఈ కుటుంబం.. కిలో బంగారం పోగేసింది! ఐదు బ్యాంకు ఖాతాల్లో రూ.37 లక్షలు కూడబెట్టింది.మరో రూ.30 లక్షలు అధిక వడ్డీలకు అప్పులిచ్చింది. అంతేనా.. ఇంకో రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో భద్రపరిచింది. ఇక్కడితో అయిపోలేదు.. వీరికి పది ప్లాట్లు కూడా ఉన్నాయని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ బ్యాంకులాకర్లలో దొరికాయి. వీటన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. మంగమ్మను పోలీసులు అరెస్టు చేయగానే కోర్టును ఆశ్రయించిన తండ్రీకొడుకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వీరికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more