దళితుల అభ్యున్నతి కోసం తాము చేసిన త్యాగాలు వృథా అవుతున్నాయన్న వాస్తవం ఆ వృద్ధ నేతను తీరని వ్యథకు గురిచేసింది. తనలాంటి ఎందరో కష్టపడి సాధించిన హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన నిబంధనలు గాలికిపోతున్నాయన్న కఠోర వాస్తవం ఆయన్ను కలచి వేసింది. నేటి ప్రజా ప్రతినిధుల అలసత్వ వైఖరి ఆయన్ను నిలవనీయలేదు. దాంతో ఏకంగా కలెక్టరేట్ సాక్షిగా అగ్గి పెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడాయన! ఆయన పేరు బలిరాం ప్రసాద్. వయసు 65 ఏళ్లు. ప్రముఖ దళిత నాయకుడు. గతంలో బీఎస్పీలో కీలక భూమిక నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం అంబేద్కర్ సమాజ్ పార్టీలో ఉన్నారు.ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ కలెక్టరేట్ కాంపౌండ్లోని అంబేద్కర్ పార్క్లో సోమవారం ఆయన ఆత్మాహుతికి పాల్పడటం పెను సంచలనమైంది. వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని పోలీసులు ప్రకటించారు. ఆయన వద్ద దొరికిన సూసైడ్ నోట్లోని వివరాలను వెల్లడించారు.
"ప్రస్తుత పరిస్థితుల పట్ల, ప్రజా ప్రతినిధుల పనితీరు పట్ల నేను తీవ్రంగా కలత చెందా. దళితులు, పేదల అభ్యున్నతి కోసం నేను, నాలాంటి ఎందరో నేతలు జీవిత కాలం పోరాడాం. వారిని సామాజిక అనాచారాల బారి నుంచి బయటపడేసేందుకు ఎంతగానో ప్రయత్నించాం. కానీ నేడు ఏం జరుగుతోంది? వారిపై అకృత్యాలు నిత్యకృత్యమయ్యాయి. వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. బాబా సాహెబ్ చేసిన చట్టాలూ కొరగానివిగా మారిపోయాయి. ఇదంతా చూశాక వారికి ఇంకా మేలు జరుగుతుందన్న ఆశ చచ్చిపోయింది. ఇంకా పోరాటాన్ని కొనసాగించే శక్తీ నాకు లేదని అర్థమైపోయింది. అందుకే తనువు చాలించాలని నిర్ణయించుకున్నా'' అని బలిరాం తన లేఖలో పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more