టీడీపీ అధ్యక్షుడు, నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ అంశం పై ఇన్ని రోజులు రెండు కళ్ళ సిద్ధాంతం అని చెబుతూ ఉండేవాడు. దీంతో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు తెలంగాణ లో తిరగలేని పరిస్థితి కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంలో వారు అధినాయకునిపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరికొందరైతే ఎదిరించి పార్టీనుండి బయటికి పోయి నాగం లాంటి వాళ్ళు ఆయన పై దుమ్మెత్తి పోసిన సందర్బాలు ఉన్నాయి. దీంతో పార్టీ తెలంగాణలో బలహీన పడుతుందని భావించిన చంద్రబాబు తన రెండు కళ్ళ సిద్దాంతంతో కాస్త మార్పులు చేసుకున్నాడు.
ఎలాగైనా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఆయన చేపట్టిన ‘రైతు పోరు బాట’ను తెలంగాణ జిల్లాల్లో కూడా చేస్తున్నాడు. ఈ యాత్రలో ఆయనకు చిన్న చిన్న ఆటుపోట్లు ఎదురైనా యాత్రలో దూసుకుపోతున్నాడు. తెలంగాణ ప్రజలను మరింత ఆకట్టుకోవడానికి ఆయన ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’’ అని తమ నాయకులకు హితబోత చేస్తున్నాడు. "తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత... అధికారం కేంద్రానికే ఉన్నాయి. తక్షణం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మనం కేంద్రాన్ని పదే పదే కోరాం. మనం అధికారంలో లేం. నిర్ణయం తీసుకొనే శక్తి మన చేతిలో లేదు. తెలంగాణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయిస్తే మనం ఆపగలుగుతామా? కాంగ్రెస్తో కుమ్మక్కైన శక్తులే వాస్తవాలను దాచిపెట్టి మనను బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలకు అదే చెప్పండి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు సూచించారు. ‘‘నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు’’. అనేకసార్లు ఈ విషయం బహిరంగంగానే చెప్పాను. గత ఎన్నికల ముందు తెలంగాణకు అనుకూలంగా మనం నిర్ణయం తీసుకొన్నాం. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇచ్చాం. తెలంగాణకు వ్యతిరేకమైతే ఈ పని ఎందుకు చేస్తాం? ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పండి'' అని ఆయన కోరారు. కానీ బాబు చెప్పే మాటలు కల్లిబొల్లి మాటలు అని, అవి తెలంగాణ ప్రజలు నమ్మరని నాయకులకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు టీడీపీ నాయకులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more