విజయవాడ నగర పోలీసు కమిషనర్ ఎన్.మధుసూధనరెడ్డి త్వరలో బదిలీ కానున్నట్టు తెలిసింది. ఆయనను వచ్చే 10రోజులలో హైదరాబాద్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం అవుతున్నట్టు పోలీసు వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కొత్త సీపీగా సీనియర్ పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్ర, వి.ఎస్.సజ్జనార్ పేర్లు విన్పిస్తున్నాయి. 2010లో పీఎస్ఆర్ ఆంజనేయులు కమిషనర్గా వివాదాలలో చిక్కుకున్న తరువాత విజయవాడలో నెలకొన్న కొన్ని ప్రత్యేక పరిస్థితులలో గత ఏడాదిన్నరగా ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2011 జులై నుంచి కమిషనర్గా పనిచేస్తున్నా ఆయన చాలా సౌమ్యంగా వ్యవహరించారు. వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నించారు. కానీ నేరాల నిరోధం,శాంతి భద్రతల సమస్యకు సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకోవడంలేదనే అపవాదును మూటగట్టుకున్నారు. రాజకీయ నాయకుల సిఫార్సులు కొన్ని అంశాలలో పరిగణలోకి తీసుకున్నా చాలా మౌనంగా సున్నితంగా తన పని తాను చేసుకుపోయే మనస్తత్వంతో ఉన్నారు. మీడియా కూడా చాలా వరకు దూరంగా ఉంటూ వచ్చారు. ఎక్కువ ప్రచారం కోరుకోకుండా ఏ అంశాన్ని అయినా పేపరుపై పెట్టే తత్వం కల్గిన కమిషనర్ కింది స్థాయి సిబ్బందిపై వత్తిడి పెంచి పనిచేయిస్తారనే ప్రచారం ఉంది. రాజకీయ వత్తిడిలు అధికంగా ఉండే విజయవాడ లాంటి నగరంలో 20 నెలలు నిలదొక్కుకున్నారంటే గొప్ప విషయమే. సౌమ్యుడుగా ఉంటూ అందరి వద్ద మంచిపేరు తెచ్చుకోవాలనే తపన అధికంగా ఉంది. అయితే ప్రజలను నేరంగా కలుసుకోవడానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదనే విమర్శ ఉంది. గత కమిషనర్ల మాదిరిగా ప్రజలలో మమేకం కాలేకపోయారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more