సీ ఫుడ్ లలో ప్రత్యేకమైన వంటకాలను తయారుచేయడంలో తమిళనాడు పెట్టింది పేరు. మత్స్యకారుల జీవనాధారం కూడా ఈ చేపలే. కేవలం సీ ఫుడ్ లలోనే కాదు.. దక్షిణ భారతదేశంలోనే తమిళనాడులో రకరకాల వంటకాలను తయారుచేస్తారు. అటువంటి వంటకాలలో ఈ చికెన్ పులుసు కూడా ఒక్కటి. తమిళంలో దీనిని కరిమీన్ కుళంబు అని అంటారు. ఇది అద్భుతమైన రుచి కలిగినటువంటి ఒక సీ ఫుడ్. ఎంత అద్భుతం అంటే.. యావత్ దక్షిణ భారతదేశంలోనే ఇది ఎంతో పేరుగాంచింది.
ఈ తమిళనాడు చికెన్ పులుసును తయారుచేయడంలో ఉపయోగించే పదార్థాలు ఇతర పులుసుల కంటే కొంచెం భిన్నంగా వుంటాయి. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తయారుచేసిన రోజుకంటే తరువాతి రోజే ఎంతో రుచికరంగా వుంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా! ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండెకు సంబంధించిన జబ్బులను నివారించి.. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా మనసులో వున్న ఒత్తిడిని, ఆర్థరైటిస్ (కీళ్లవాపు)ను కూడా నివారిస్తుంది.
కరిమీన్ కుళంబు (చికెన్ పులుసు) తయారీకి కావలసిన పదార్థాలు :
చేపలు : 500 గ్రాములు
కొత్తమీర తరుగు : 1 కప్
పసుపు : 1/2 కప్
టొమాటో : 250 గ్రాములు
బిర్యానీ ఆకు : 1
కరివేపాకు : ఒక రెమ్మ
గరం మసాలా : 1 టేబుల్ స్పూన్
సాంబార్ ఉల్లిపాయలు : 250 గ్రాములు
ఉప్పు : రుచికి సరిపడేంత
నూనె : తయారీకి సరిపడేంత
మసాలా తయారీకోసం కావలసినవి :
పచ్చిమిర్చి : 5-8
ఎండుకొబ్బరి తురుము : 1 కప్
మిరియాలు : 1 టేబుల్ స్పూన్
చింతపండు : 50 గ్రాములు
ధనియాలపొడి : 1 టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
నూనె : 80 మిల్లీ లీటర్లు
సాంబార్ ఉల్లిపాయలు : 250 గ్రాములు
తయారుచేసే విధానం :
1. మొదటగా చేపల చుట్టూ వున్న పొట్టును తీసేసి, ఉప్పుతో బాగా తరుగుతూ శుభ్రం చేసుకోవాలి. ముక్కలుగా చేసుకుని లోపలి భాగాలను కూడా బాగా కలియబెట్టి శుభ్రం చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి.
2. ఒక పెనుమును స్టౌ మీద పెట్టి... అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయిన తరువాత పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, ఉల్లిపాయలు అన్ని ఒక్కొక్కటిగా వేస్తూ వేగించుకోవాలి.
3. కొద్దిసేపు వేడి అయిన తరువాత అందులోనే ధనియాలపొడి, పసుపు, చింతపండు గుజ్జు వేసి కలియబెట్టాలి. చల్లారిన తరువాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
4. మందంగా వున్న వేరొక గిన్నెను ఒక స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనెను పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు, తమలపాకు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, రుచికి సరిపడేంత ఉప్పును పోసి 5 నిముషాలవరకు బాగా వేడి చేసుకోవాలి.
5. పైన చేసుకున్న మిశ్రమం కింది భాగంలో మాడకుండా కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ కలియబెట్టుతూ వుండాలి.
6. ఈ మిశ్రమాన్ని వేడి చేస్తుండగానే.. అందులో ఇంతకుముందు పేస్ట్ లా తయారుచేసుకున్న మిశ్రమాన్ని, చింతపండు గుజ్జును బాగా కలిపి కొద్దిసేపు వరకు ఉడికించుకోవాలి.
7. ఈ విధంగా రెండు మిశ్రమాలను కలిపి కొద్దిసేపు వరకు వేడిచేసిన తరువాత.. అందులో ముందుగా శుభ్రం చేసిపెట్టుకున్న చేప ముక్కలను వేసి కొద్దిసేపు వరకు వేడి చేసుకోవాలి.
8. కొద్దిసేపు తరువాత అందులో గరం మసాలా, కొత్తిమీర చల్లి వేడి స్టౌ ఆఫ్ చేసుకుని కిందకు దించుకోవాలి.
అంతే! ఇలా ఈ విధంగా ఘుమఘుమ వాసనలతో కూడిన కరిమీన్ కుళంబు (చేపల పుసులు)ను తమిళనాడు స్టయిల్ లో ఎంతో రుచికరంగా తయారుచేసుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Nov 05 | మాంసాహారప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే చికెన్ తో ఎన్నోరకాల వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో డిఫరెంట్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఇక చికెన్ తో తయారుచేసే వివిధ వంటకాల్లో చికెన్ గారెలు... Read more
Oct 08 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు రుచికరమైన వెరైటీ వంటకాల్ని తీసుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి ప్రత్యేకమైన వంటకాల్లో చికెన్ లాలీపాప్స్ ఒకటి. ఎంతో రుచికరంగా వుండే ఈ రిసిపీని తీసుకోవడానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఎంతో... Read more
Sep 18 | వీకెండ్ వచ్చిందంటే చాలు.. ప్రతిఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా వుంటారు. ఆ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేయాలంటే ఆ వీకెండ్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ వుండాల్సిందే! అప్పుడు దాని మజాయే వేరుగా వుంటుంది.... Read more
Sep 08 | బియ్యపు పిండితో తయారయ్యే వేడివేడి వడలు కేరళలో ఎంతో స్పెషల్ రెసిపీ. ఇవి కూడా సాధారణ గారెలలాగే వుంటాయి కానీ.. మరింత క్రిస్పీగా, టేస్టీగా వుంటాయి. ఈ వడలతో ఆరోగ్య ప్రయోజనం కూడా వుంది.... Read more
Aug 27 | మాంసాహారులు ఎంతో ఇష్టంగా తినే చికెన్ తో రకరకాల వంటకాలు తయారుచేసుకోవచ్చు. చికెన్ పకోడీలు, బిర్యానీ, ఇంకా నోరూరించే స్పెషల్ వంటకాలు ఎన్నో వున్నాయి. పైగా.. ఈ చికెన్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.... Read more