Pm seeks proposal to improve security in hyderabad

hyderabad blasts, manmohans hyderabad visit, dilsukhanagar blasts

PM seeks proposal to improve security in Hyderabad

security.gif

Posted: 02/25/2013 03:33 PM IST
Pm seeks proposal to improve security in hyderabad

PM seeks proposal to improve security in Hyderabad

జంటనగరాల్లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో జన సమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలపై పోలీసులు దృష్టిపెట్టారు. షాపింగ్‌మాల్స్‌లో భద్రతా చర్యలు తీసుకోవాలని వాటి యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశారు. నగరంలోని ప్రముఖ షాపింగ్ మాల్స్, నిత్యం రద్దీగా ఉండే వాటిల్లో భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో జరిగిన పేలుళ్ల తర్వాత కూడా ఇలాంటి ఆదేశాలు ఇచ్చినా చాలా షాపింగ్ మాల్స్ సరైన చర్యలు తీసుకోకపోడంపై పోలీసులు ఇప్పటికే ఆయా మాల్స్ యాజమాన్యాలకు నోటీసులు పంపినట్టు తెలిసింది. పరిస్థితి చేయిదాటిన తర్వాత తీసుకునే చర్యల కంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మాల్స్ నిర్వాహకులకు సూచించారు. ఏ షాపింగ్ మాల్స్‌లో అయినా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలన్నారు. సాధారణ ప్రజలు కూడా సమాచారం ఇవ్వడానికి ఫోన్ నెంబర్లు, అధికారుల వివరాలను అందుబాటులో ఉంచుతామని మాల్స్ నిర్వాహకులకు సూచించినట్లు పోలీసులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో పోలీసులు నేరుగా వెళ్లి భద్రతా చర్యలపై తనిఖీ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలి జంటనగరాల్లో తీవ్రవాద కార్య కలాపాలను అరికట్టడంలో పోలీసులు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే షాపింగ్ మాల్స్ నిర్వాహకులకు సూచనలు చేస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలను తీవ్రవాదులు ఎంచుకుంటున్నారు.

PM seeks proposal to improve security in Hyderabad

దిల్‌సుఖ్‌నగర్ వంటి రద్దీగా ఉండే ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగినట్టుగానే మాల్స్‌లో జరిగితే పరిస్థితి ఏమిటన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అమీర్‌పేట, బంజారాహిల్స్, బేగంపేట, పంజాగుట్ట, ఆబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో ఉన్న షాపింగ్‌మాల్స్ నిత్యం రద్దీగా ఉంటాయి. ఆయా షాపింగ్‌మాల్స్‌లో జనం అధికంగా ఉన్నసమయాల్లో పేలుళ్లు జరిగితే ప్రాణనష్టంతోపాటు, ఆస్తి నష్టం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నగరంలోని చాలా షాపింగ్‌మాల్స్ నిర్వాహకులు నామమాత్రంగా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.అనేక సందర్భాల్లో పోలీసులు కూడా వాటిని పరిశీలించి పెదవి విరిచారు. తర్వాత వారికి నోటీసులు జారీ చేశారు. భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన సంఘటనతో పోలీసులు షాపింగ్‌మాల్స్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. మాల్స్‌లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసుకోవాలని ఆదేశించారు. ప్రవేశ ద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, మాల్స్ లోపల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వారి సమాచారాన్ని ఇవ్వాలన్నారు.రద్దీ ప్రాంతాలే టార్గెట్ నగరంలో రద్దీగా ఉండే ప్రాంతాలతో పాటు షాపింగ్ మాల్స్‌నే తీవ్ర వాదులు టార్గెట్ చేశారన్న విషయాన్ని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సాధారణంగా సాయంత్రం సమయాల్లో షాపింగ్‌మాల్స్ కిటకిటలాడుతుంటాయి. జనం రద్దీగా ఉండే ప్రాంతాలను తీవ్రవాదులు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకుని మాల్స్ నిర్వాహకులు భద్రత విషయంలో అలర్ట్‌గా ఉండాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Normalcy returns to dilsukhnagar
Tv actress arrested in prostitution case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more