నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం చేస్తూ వస్తుండటంతో నగరంలోని కార్మికులు సమ్మెకు దిగాలని జీహెచ్ఎంసీ అధ్యక్షుడు గోపాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని, అందుకే మళ్ళీ సమ్మె చేయవలసి వస్తుందని అన్నారు. ప్రతి కార్మికుడి కనీసం వేతనం రూ. 16,500 ఉండాలని గోపాల్ అన్నారు. ప్రతి కార్మికుడు చేతులకు గ్లౌజులు ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా మించిపోయింది లేదని, ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటే సమ్మెను విరమిస్తామని గోపాల్ స్పష్టం చేశారు. మరి సమ్మె పై ప్రభుత్వం త్వరగా స్పందించి, కార్మికుల డిమాండ్లను నెరవేర్చి నగరంలోని సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more
Dec 12 | ఈరోజుతో శీతకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ద్రుష్టి మొత్తం అసెంబ్లీ మీదే ఉంది. ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు నగరానికి... Read more