రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, సీమాంధ్ర మంత్రులు నిర్ణయించారు. ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు చివరి తేదీ వరకూ సమయాన్ని వినియోగించుకోవాలని, అవసరమైతే రాష్ట్రపతిని అదనంగా మరో 20 రోజుల సమయం కోరాలని కూడా వారు భావించారు. అయితే అసెంబ్లీలో రభసా మాత్రం ఇంతటితో ముగిద్దాం అని సీమాంద్ర నాయకులు అంటున్నారు.
మనసు గాయపడింది
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనమండలిలో జరిగిన ఘటనతో తన మనసుకు గాయమైందని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. నిన్న జరిగిన ఘటనలో ఆమె కిందపడిపోయారు. దీనిపై మంగళవారం నన్నపపేని మాట్లాడుతూ జరిగిన ఘటనలో తగిలిన దెబ్బలు కంటే మనసుకు గాయమైందని అన్నారు. దీనిపై పిర్యాదు చేశామని దానికి వారు క్షమాపణలు చెప్పారని అన్నారు. అయితే దానిపై ఇప్పుడు ప్రస్తావన తేవడం సరికాదని ఆమె అన్నారు.
రాష్ట్ర విభజన జరగకముందే ఇలా ఉంటే, రేపు విభజన జరిగిన తర్వాత ఎలా ఉంటుందో ప్రజలు అర్ధం చేసుకోవాలని నన్నపనేని కోరారు. తెలంగాణ కోసం వారు మాట్లాడినప్పుడు, సీమాంధ్రలో ఉన్న సమస్యలపై తాము మాట్లాడడం తప్పా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ విధంగా ఉంటే సీమాంద్రులకు ప్రాణ, ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.
బిల్లుపై సమయం జనవరి 23 వరకు ఉంటే, రెండు, మూడు రోజుల్లో చర్చలు ముగించి, 'మమా' అనిపించి, రాష్ట్రపతికి పంపాలని డిమాండ్ చేయడం సరికాదని ఆమె అన్నారు. ఇదెక్కడి న్యాయమని నన్నపనేని ప్రశ్నించారు. నాయకులనే ప్రాణ రక్షణ లేకపోతే, ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆమె ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more
Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more
Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more
Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more
Dec 12 | ఈరోజుతో శీతకాలం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ద్రుష్టి మొత్తం అసెంబ్లీ మీదే ఉంది. ఈరోజు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్తో పాటు కార్యదర్శులు తిరునావుక్కరసు, కుంతియాలు నగరానికి... Read more