‘ఓటుకు నోటు’, ‘ఫోన్ ట్యాపింగ్’ వ్యవహారాలపై మీడియా ప్రెస్ మీట్ లో పవన్ కల్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే! దీంతో టీడీపీ వర్గాలు ఆయన మీద ఒంటికాలితో లేచిపడుతున్నారు. మొన్నటిదాకా పవన్ అంటే జేజేలు కొట్టిన టీడీపీ వర్గాలు ఇప్పుడు ఆయన మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన వైఎస్సార్ పార్టీ.. తనదైన శైలిలో చంద్రబాబు మీద మరోసారి విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ పార్టీ, చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుకున్నంతసేపు వాడుకుని, ఇప్పుడు వదిలేశారని అంబటి ఆరోపించారు. పవన్ పై టీడీపీ ఎంపీలు విమర్శలు గుప్పించడం సామాన్యమైన విషయం కాదని.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే జరిగిందని ఆయన అన్నారు. బాబు ఆమోదముద్ర లేనిదే టీడీపీ ఎంపీలు ఏమీ చేయలేరని చెప్పారు. ఏదేమైనప్పటికీ.. ఎవర్నైనా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని అంబటి మండిపడ్డారు. పవన్ ను విమర్శించడానికి కొందర్ని పురమాయించి, మరికొందరికి పవన్ కు మద్దతుగా మాట్లాడే పనిని బాబు అప్పగించి ‘డబుల్ గేమ్’ ఆడుతున్నారని అంబటి స్పష్టం చేశారు.
ఇక అంబటి రాంబాబుతో మరికొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఇదేవిధంగా బాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసి, ఆ పార్టీకి అధికారం దక్కేలా సపోర్ట్ చేసిన పవన్ మీద ఆ పార్టీ వర్గాలే విరుచుపడటం సమంజసం కాదని అంటున్నారు. మరి.. అంబటి రాంబాబు, వైకాపా చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ వర్గాలు ఎటువంటి సమాధానమిస్తాయో వేచి చూడాల్సిందే!
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more