ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఓ వైపు ఆ ప్రాంత రైతులు గత 21 రోజులుగా నిరసనలు కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా.. జనవరి 20 లోగా ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖకు తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యోచిస్తున్న క్రమంలో ఇవాళ జాతీయ రహదారుల దిగ్భంధనంతో పాటు మహాధర్నా నిర్వహణకు అమరావతి రైతులు పిలుపునిచ్చారు. పోలీసులు ముందస్తు చర్యల్లు చేపట్టి గ్రామాల నుంచి రహదారులపైకి రాకుండా కంచెలను ఏర్పాటు చేసినా.. వాటిని చేధించుకుని రైతులు ఒక్కొక్కరుగా పెద్ద సంఖ్యలో రైతులు చినకాకానికి చేరుకున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు..పెద్దపెట్టున నినాదాలు చేస్తూ.. నిరసన కార్యక్రమాలకు చేపట్టారు. ఈ తరుణంలో రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో అటుగా వచ్చిన మంత్రి అదిమూలపు సురేష్ కు రైతుల నిరసన సెగ తగిలింది. ట్రాఫిక్ లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇబ్బందులు పడ్డారు. మంత్రి వాహనానికి దారి వదిలకుండా అందోళనకారులు రోడ్డుకు అడ్డంగా బైఠాయించిన రైతులను పోలీసులు పక్కకు వెళ్లాలని చెప్పినా వారు వినలేదు. చివరకు పోలీసులు అందోళనకారులను చెదరగొట్టి మంత్రిని పంపించారు.
ఆ తరువాత అదే మార్గంలో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తీవ్రంగా తాకింది. ఆయన కారుపై రాళ్లు రువ్విన అందోళనకారులు.. గన్ మెన్లపై కూడా దాడికి పాల్పడ్డారు. గన్ మెన్లతో కారులో చినకాకానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును నిరసనకారులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు ఎలాంటి హానీ జరగకూడదని గన్ మెన్లు ఆయనకు రక్షణగా నిల్చున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి వచ్చి గన్మెన్లపై దాడికి దిగారు. కారును ముందుకు వెళ్లకుండా నిరసనకారులు అడ్డుకొన్నారు.
అంతే కారుపై నిరసనకారులు దాడికి దిగారు. ఎమ్మెల్యే కారుకు మరో కారును అడ్డుగా నిలిపారు. కారుపై రాళ్లతో దాడికి దిగారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అంటూ కారు చుట్టూ ఆందోళనకారులు అడ్డుకొన్నారు. కారు ముందు కొందరు బైఠాయించారు. కారును ముందుకు పోకుండా అడ్డుకొన్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారును ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుకు అడ్డు పెట్టారు. పిన్నెల్లి కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకొన్నారు. పోలీసులు కారును బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించిన ఆందోళనకారుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.
అయితే ఈ సమయంలో కారుపై నిరసనకారులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో కారు అద్దాలను మూసివేశారు. మరో వైపు కారుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ రాళ్ల దాడితో కారు వెనుక అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఎదురుగా ఉన్న కారును అతి చాకచక్యంగా తప్పించుకొంటూ స్పీడుగా ముందుకు పోనిచ్చాడు. ఈ సమయంలో ఎమ్మెల్యే కారును వెంటాడి రాళ్లతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై తరువాత స్పందించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తన కారును ధ్వంసం చేసి.. గన్ మెన్లపై దాడికి పాల్పడింది రైతులు కాదుని, టీడీపీ మనుషులని అరోపించారు. రైతులు నిరసన చేప్టటడానికి మందుకోట్టి వస్తారా.? అంటూ ప్రశ్నించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more