కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను నిరసిస్తూ జనవరి 8న దేశవ్యాప్త సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను సవరించి నాలుగు వర్గాలుగా విభజించే బిల్లును వ్యతిరేకించిన జాతీయ కార్మిక సంఘాలు ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడంతో పాటు పబ్లిక్ సెక్టార్ కెంపనీలను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. 44 కార్మిక చట్టలాను వేతనాలు, పారిశ్రమి సంబంధాలు, సామాజిక బాధ్రత, సురక్షితమైన పని పరిస్థితుల కల్పన అను నాలుగు కోడ్ లలోకి విభజించారు.
వీటితో పాట వేతన సవరణ, మినిమమ్ వేతనాల పెంపు, పబ్లిక్ సెక్టార్ సంస్థల ప్రైవేటీకరణ, సీఏఏ చట్టం ఉపసంహరణ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తూ పది జాతీయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే ఈ సమ్మెలో బ్యాంకింగ్ రంగం కార్మిక సంఘాలు కూడా పాల్గోననుండటంతో పాటు.. విద్యార్థి, రైతు సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారంతో పాటు బ్యాంకుల విలీనం యోచనను కేంద్రం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు.
బ్యాంకింగ్ ఉధ్యోగుల సమ్మెతో అటు బ్యాంకులతో పాటు ఇటు ఏటీయం కేంద్రాలలో కూడా సేవలు నిలిచిపోనున్నాయి. దీంతో తమకు ఇది భారీ నష్టాన్ని కలిగించే అవకాశముందని చిన్న బ్యాంకులు అందోళన చెందుతున్నాయి. అమాంతం పెరుగిన విద్యా వార్షిక పీజులతో పాటు పరీక్షా ఫీజులు, హాస్టల్ ఫీజులు, బొజన ఫీజుల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి. కాగా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు సంఘాలు కూడా సమ్మెకు పిలుపునిచ్చాయి.
దీంతో ప్రధానమైన పది కార్మిక సంఘాలతో పాటు పలు అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, బ్యాంకింగ్ రంగ యూనియన్లు అన్ని కలవడంతో ఏకంగా దేశజనాబాలోని పాలుశాతం మంది అనగా ఏకంగా 25 కోట్ల మంది ప్రజలు ఈ సమ్మెలో పాల్టొంటున్నారు. ఒక రకంగా దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగనున్న క్రమంలో పలువురు దీనిని భారత్ బంద్ గా నామకరణం చేసి సామాజిక మాధ్యమాల్లో విసృత్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 8న జరగనున్న సమ్మెకు పోలీసులు కూడా దేశవ్యాప్తంగా అప్రమత్తమయ్యారు.
గత ఏడాది సెప్టెంబర్ లో సమావేశమైన పది కార్మిక సంఘాలు జనవరి 8న దేశవ్యాప్త బంద్ కు పిలుపునివ్వాలని అప్పుడే నిర్ణయించాయి. దీంతో ఈ నెల 8న సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపించనున్నట్లు ఉద్యోగ, సేవా రంగ, పారిశ్రామిక, బ్యాంకింగ్, విద్యార్థి, రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఇది కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కల్పించాలని వారు కోరుతున్నారు. ఇక రమారమి అన్ని వర్గాలకు చెందిన కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్న క్రమంలో ఇప్పుడిదీ సమ్మె రూపం కాకుండా భారత్ బంద్ రూపాన్ని దాల్చిందని సామాజిక మాద్యమాల్లో ప్రచారం జోరందుకుంది.
రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాల తరపున జనవరి 8న బారత్ బంద్ జరుగుతున్నదంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్లోని డిజీపీ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించింది. దీంతో అన్ని జిల్లాలలోనూ పోలీసు బందోబస్తు ముమ్మరం చేశారు. మరోవైపు నేషనల్ ట్రేడ్ యూనియన్ జనవరి 8న ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ రెండు రోజుల ఆందోళన కార్యక్రమానికి పలు బ్యాంకు యూనియన్లతో పాటు రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ పలువురు పోస్టులు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more