ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవరావతి పరిధిలో ఎక్కడ చూసిన రైతులు అందోళనబాట పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్ నేపథ్యంలో ఎంతో భాదపడినా.. తమవారి భవిష్యత్ తరానికి మేటు జరుగుతుందన్న ఆశతో తాము ప్రభుత్వానికి భూములను అందించామని.. అయితే ఇప్పడు తమ భూములతో పాటు తమ వారి భవిష్యత్తును కూడా అదే ప్రభుత్వం అంథకారమయం చేసిందని రైతులు అరోపిస్తున్నారు. అధికారంలోకి పార్టీలు మారినంతమాత్రన.. ప్రభుత్వాల విధివిధానాలను లెక్కపత్రం లేకుండా ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని పేరుతో తీసుకున్న తమ భూములను ఐదున్నరేళ్లు పాటు ప్రభుత్వం తమ వద్ద అంటిపెట్టుకుని.. హద్దులను చెరిపేసి.. పంటపోలాలను కాంక్రీట్ మయంగా మార్చిన తరువాత ఇప్పుడు వెనక్కు తిరిగిస్తామని అనడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని పరిరక్షణ సమితి జేఏసీ ఇవాళ తలపెట్టిన జాతీయ రహదారుల దిగ్భంధనంలో రైతులకు మద్దతుగా అక్కడకు చేరుకుని సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన టీడీపీ యువనేత నారా లోకేష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
జాతీయ రహదారి దిగ్భందానికి విపక్షాలు పిలుపు ఇవ్వడంతో నారా లోకేష్ చినకాకానికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగానే అప్రమత్తమై లోకేష్ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ అరెస్టును అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిగ్గా బెంజ్ సర్కిల్ సమీపానికి చేరుకున్న నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి యనమల కుదురు పొలిస్ స్టేషన్ కు తరలించారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
అమరావతిలో ఆందోళనలు మరింత ఉదృత రూపం దాల్చాయి. రాజధాని రైతులతోపాటుగా పలు పార్టీల నేతలు రోడ్లపై ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కూడా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో మూడు ‘రాజధానులు వద్దు- అమరావతి ముద్దు’ అనే నినాదంతో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి డిలాక్స్ సెంటర్ వకు నిరసన ర్యాలీ కొనసాగింది. టీడీపీ, జనసేన న్యాయవాదులు, వివిధ రాజకీయ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more