టిక్ టాక్ పిచ్చి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురి ప్రాణాలను హరించిన విషయం తెలిసిందే తాజాగా ఇది గ్రామాలకు కూడా విస్తరించి అక్కడి యువత ప్రాణాలను కూడా బలిగొంటోంది. వరద నీళ్లతో పొంగిపొర్లుతున్న వాగులో నిలబడి సరదాగా వీడియో తీసుకోబోతూ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. రెండు రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్ యువకుడి మృతదేహాన్ని వాగు నుంచి బయటకు తీశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో జరిగింది.
గోన్గొప్పుల్కు చెందిన దినేష్ రెండు రోజుల క్రితం తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఊరు శివారులో ఉన్న కప్పల వాగుకు వెళ్లారు. అప్పటికే వాగు వరద నీళ్లతో పొంగిపొర్లుతోంది.. ముగ్గురు వాగులోకి దిగి టిక్టాక్ వీడియోలు తీసుకున్నారు. అదే సమయంలో వాగు ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ముగ్గురు నీళ్లలో కొట్టుకెళ్లారు.. వెంటనే గమనించి స్థానికులు ఓ చీరను విసిరారు. ముగ్గురిలో గంగాజలం, మనోజ్లు బయటపడగా.. దినేష్ మాత్రం ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
దినేష్ వాగులో గల్లంతు కావడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ను రంగంలోకి దించి గాలించగా.. ఆదివారం యువకుడి మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. కుమారుడ్ని విగత జీవిగా చూసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. దినేష్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి.. మూడు నెలల క్రితం తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో మళ్లీ దుబాయ్ వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more