టీటీడీ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఇటీవల కొత్త పాలక మండలిని ఏర్పాటుచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. తాజాగా, అఫీషియోతో కలిపి మొత్తం 28 మందిని సభ్యులుగా నియమించారు. గత ప్రభుత్వంలో 18 మందితో పాలకమండలిని ఏర్పాటుచేయగా, ఇప్పుడు ఆ సంఖ్య 28కి చేరింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మంది, తెలంగాణ నుంచి ఏడుగురు, తమిళనాడు నలుగురు, కర్ణాటక ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్ర ఒక్కొక్కరికి ఇందులో సభ్యత్వం కల్పించారు.
శనివారమే ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయగా, మిగతా పాలక మండలి సభ్యులంతా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం పాలక మండలి సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గిస్తూ తీర్మానం చేశారు. రూ.36 కోట్లతో ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు. గతంలో రూ.150 కోట్లతో రెండు విడతల్లో ఆలయాన్ని నిర్మించాలని భావించిన విషయం తెలిసిందే. తిరుపతి అవిలాల చెరువు అభివృద్ధికి రూ.48 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతిలో గరుడ వారధి నిర్మాణాన్ని కొనసాగించాలని.. టీటీడీలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కమిటీ ఏర్పాటుకు సమావేశంలో సూత్రప్రాయంగా అంగీకరించారు. టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక అధికారిగా రవిప్రసాద్ను నియమిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో నీటి సమస్యను నివారించడానికి బాలాజీ రిజర్వాయర్ నిర్మించాలని తీర్మానించారు.
తిరుమల తరహాలో మొత్తం ఆరు దశల్లో రూ.150 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం నిర్మించాలని భావించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ మేరకు నిధులు వెచ్చించడం సరికాదని తొలి దశలో రూ.36 కోట్లతో అంత:ప్రాకారం వరకు నిర్మించాలని తీర్మానించారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీని కోసం తుళ్లూరు మండలం వెంకటపాలెంలో 25 ఎకరాలను కేటాయించింది. 2020 డిసెంబరు లేదా 2021 జనవరి నాటికి పూర్తి చేసేలా కాంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జనవరిలో అక్కడ పనులు ప్రారంభమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more